Eto Vellipoindi Manasu : ఆయిల్ పోసి విడగొట్టాలనుకున్న అత్త.. కొడుకు కనిపెట్టేనా!
on Oct 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -219 లో.....సందీప్ రౌడీతో ఫోన్ మాట్లాడతాడు. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకోమని సందీప్ అనగానే.. అవునా అయితే ఒక వీడియో పంపిస్తున్నాను చూడమని రౌడీ అంటాడు. అందులో రౌడీ తో సందీప్ మాట్లాడిన మాటలు ఉంటాయి. అది చూసి రౌడీకి సందీప్ ఫోన్ చేస్తాడు. ఆ వీడియో మీ అన్నయ్యకి పంపాలా అని రౌడీ అనగానే.. వద్దు నీకు ఎంత డబ్బు కావాలో ఇస్తానని సందీప్ అంటాడు. అయితే నేను చెప్పిన ప్లేస్ కి మనీ తీసుకొని రా అని రౌడీ అంటాడు.
సందీప్ ఫోన్ మాట్లాడడం రామలక్ష్మి వింటుంది. ఖచ్చితంగా అదేంటో కనుక్కోవాలని రామలక్ష్మి అనుకుంటుంది. మాణిక్యానికి రామలక్ష్మి ఫోన్ చేసి ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ కి చెప్పాలనుకుంటుంది.లేదు అవన్నీ టెన్షన్ అయనకి ఎందుకని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కిచెన్ లోకి వెళ్లి రామలక్ష్మి పాలు పోసి అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి సీతాకాంత్ కి ఇస్తుంది. అవి తాగి సీతాకాంత్ పడుకుంటాడు. సారీ అండి అని రామలక్ష్మి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మాణిక్యం దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. ఇద్దరు కలిసి రౌడీ ని చూస్తారు. అప్పుడే సందీప్ వచ్చి రౌడీకీ డబ్బులు ఇవ్వడం ఇద్దరు చూస్తారు. సందీప్ వెళ్ళిపోయాక రౌడీని పట్టుకొని తమతో పాటు తీసుకొని వస్తుంటే.. ఇంకా కొందరు రౌడీ లు ఎటాక్ చేస్తారు. మాణిక్యం అందరిని కొడుతాడు. రౌడీ ని కార్ లో ఎక్కించుకొని వెళ్తుంటే.. వారిని రౌడీలు వెంబడిస్తారు.
ఆ తర్వాత రౌడీలని డైవర్ట్ చెయ్యడానికి రామలక్ష్మి ఒక దగ్గర ఆపి ఇక్కడ దాక్కోండి.. వాడితో నిజం చెప్పించి వీడియో తీసి పంపు.. నేను ఎప్పుడు తీసుకొని రమ్మంటే అప్పుడు రా అని రామలక్ష్మి వాళ్ళని దింపి వెళ్తుంది. మరొకవైపు సీతాకాంత్, రామలక్ష్మి విడిపోవాలని సీతాకాంత్ బెడ్ పక్కన శ్రీలత, శ్రీవల్లి ఆయిల్ పోస్తారు. సీతాకాంత్ కి జ్యూస్ ఇచ్చి లేపుతారు.. సీతాకాంత్ లేచి వస్తుంటే జారీ పడిపోతాడు. అదేంటి ఇక్కడ ఆయిల్ ఎవరు పోశారు. అసలు రామాలక్ష్మి ఎక్కడ కన్పించడం లేదని శ్రీలత అంటుంది. దాంతో నేను ఎక్కడికి వెళ్ళకని రామలక్ష్మి ఇచ్చిన మాటని సీతాకాంత్ గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read