అసలు నిజంగా నువ్వు పెళ్ళి చేసుకున్నావా.. ఆ నిజం తెలిసింది!
on Jul 7, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -142 లో.. నాకు నగలు ఇచ్చింది సందీప్ అని మల్లేశ్ చెప్పగానే.. సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత సందీప్ ని కొట్టబోయి ఆగిపోతాడు. నిన్ను కొట్టాలంటే కూడా అసహ్యం వేస్తుంది. నీకు నేనేం తక్కువ చేశాను. అన్యాయంగా రామలక్ష్మిపై నిందలు వేసి అందరు తనని మాటలు అనేలా చేసావని సందీప్ ని సీతాకాంత్ తిడతాడు. నేను నగలు దొంగతనం చేసి మా నాన్నకి ఇచ్చాను అన్నారు కదా.. ఇప్పుడేమంటారు నన్ను దోషిగా నిలబెట్టి అవమానించారు.. ఇప్పుడేం సమాధానం చెప్తారని రామలక్ష్మి అంటుంది.
అపుడే మాణిక్యం వచ్చి.. వాళ్ళని అడిగితే ఎలా నీ భర్తని అడుగు అని అంటాడు. అక్కడున్న మల్లేష్ ని మాణిక్యం తిట్టి పంపిస్తాడు. నగలు దొరికాయి కదా అప్పుడు నిన్ను అంత అవమానించారు అసలు దొంగ తెలిసింది.. ఇప్పుడు అతనికి ఏం శిక్ష వేస్తారని మాణిక్యం అడుగుతాడు. ఆ లోపే శ్రీలత సందీప్ దగ్గరికి వెళ్లి.. తన చెంపపై ఒక్కటిస్తుంది. సందీప్ ని శ్రీలత తిడుతుంది. నీ గురించి బంగారం లాంటి కోడలిని అవమానించాను.. నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచే వాడు.. ఇంట్లో ఉండడం వద్దు.. ఇంట్లో నుండి వెళ్ళిపోమని శ్రీలత అని అనగానే.. అమ్మ నిర్ణయమే నా నిర్ణయమని సీతాకాంత్ అంటాడు. బావగారు ఈ ఒక్క తప్పుని క్షమించి వదిలేయండి అని సీతాకాంత్ కాళ్ళ మీద శ్రీవల్లి పడి.. రిక్వెస్ట్ చేస్తుంది. సందీప్ కూడా రిక్వెస్ట్ చేస్తాడు. అయిన పట్టించుకోకుండా రేపు ఉదయం లోగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని సీతాకాంత్ చెప్పి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరకి శ్రీలత వచ్చి నేను పొరపాటు పడ్డానని అంటుంది. మాణిక్యం వెళ్లిపోతు తన కూతురికి జాగ్రత్తలు చెప్తాడు. ఎవరు ఎలాంటి వారో తెలిసింది కదా.. నాన్న ఇక జాగ్రత్తగా ఉంటానని రామలక్ష్మి శ్రీలత వంక చూస్తూ అంటుంది. ఆ తర్వాత శ్రీలత జరిగిన దాన్ని గుర్తుకుచేసుకుంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి వచ్చి.. తన గురించి మొత్తం తెలిసిందని చెప్పగానే శ్రీలత షాక్ అవుతుంది. అయితే ఏం చేస్తావ్.. అసలు నిన్ను సీతాకాంత్ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాడా? అసలు భార్య అని ఎవరికైనా చెప్పాడా అని శ్రీలత అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read