డాన్సర్ కేవల్ మృతి... విషాదంలో 'ఢీ' ఫ్యామిలీ
on Sep 20, 2021
యువ డాన్సర్ కేవల్ తమంగ్ మృతి చెందాడు. తెలుగు డాన్స్ రియాలిటీ షో 'ఢీ'తో పాటు హిందీ డాన్స్ రియాలిటీ షో 'డాన్స్ ప్లస్'లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కేవల్ కొన్ని రోజులుగా బ్లడ్ కాన్సర్ తో పోరాడుతున్నాడు. అతడిని కాపాడటం కోసం కొరియోగ్రాఫర్ యశ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఆర్థిక సహాయం చేయమని ప్రముఖులను, ప్రేక్షకులను కోరాడు. ప్రియమణి, రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, మేఘన తదితరులు ముందుకొచ్చారు. విధిరాత ముందు వీరి ప్రయత్నం తల వంచక తప్పలేదు.
కేవల్ తమంగ్ ఆదివారం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతడి మరణవార్తను ధృవీకరిస్తూ యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "నువ్వు లేవనే విషయాన్ని మనసుకు తీసుకోలేకపోతున్నాను. నేను ఇది భరించలేకపోతున్నాను. స్వర్గంలో విశ్రాంతి తీసుకో బ్రదర్. నన్నెప్పటికీ, జీవితాంతం ఈ వేదన వెంటాడుతుంది. నేనింకా నువ్వున్నట్టు ఫీలవుతున్నా. చాలా త్వరగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోయావ్" అని యశ్ పోస్ట్ చేశాడు. కేవల్ మృతిపై పలువురు టీవీ ప్రముఖులు, డాన్సర్లు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read