Brahmamudi : కావ్య కోసం ఆఫీస్ కి వెళ్ళిన రాజ్.. టెన్షన్ లో యామిని!
on Apr 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -688 లో.....స్వప్న, అప్పు ఇద్దరు రుద్రాణిని ప్రాంక్ చేస్తారు. రుద్రాణి భోజనానికి వచ్చేసరికి టేబుల్ పై లైవ్ ఫిష్ ఉంటుంది. అది చూసి రుద్రాణి భయపడుతుంది. ఇదేంటీ లైవ్ ఫిష్ ఉంది వండలేదా అని రుద్రాణి అనగానే మీకు ఎక్కడ కన్పిస్తుంది అక్కడ కర్రీ ఉంది కదా అని స్వప్న, అప్పు అంటారు. చికెన్ కూడా పచ్చిగానే ఉంది బంగాళాదుంప కూడా వండలేదు అలాగే పెట్టారని రుద్రాణి అంటుంది. అక్కడ అన్ని కర్రీస్ ఉన్నాయ్ మీకెందుకు అలా అనిపిస్తుందని అప్పు, స్వప్న యాక్టింగ్ చేస్తారు.
మీరు నన్ను పిచ్చి దాన్ని చేస్తున్నారా.. ఎందుకు అలా అంటున్నారు.. ఇక్కడే ఉండండి, అంటూ రుద్రాణి వెళ్ళి ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇద్దరిని తీసుకొని వచ్చి అక్కడ చూడండి వండకుండా పచ్చివి పెట్టారు కానీ వాళ్ళు కర్రీస్ అంటున్నారని చెప్పగానే ప్రకాష్ ఓపెన్ చేసేసరికి కర్రీస్ ఉంటాయి. నీకు ఏమైనా మైండ్ పని చెయ్యడం లేదా ఎందుకు ఇలా చేస్తున్నావ్ అవి కర్రీస్ అని ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. కానీ వాళ్ళు వచ్చేలోపే స్వప్న, అప్పు మారుస్తారు. మరొకవైపు కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు. అపర్ణ ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే కావ్య వెళ్లి లిఫ్ట్ చేసి పక్కకి వచ్చి మాట్లాడుతుంది చాలా సేపు ఫోన్ మాట్లాడుకుంటారు.
మరొకవైపు రాహుల్ టీనా కోసం వెతికి వెతికి ఫోన్ చేస్తాడు. స్వప్న లిఫ్ట్ చేసి నేను అడ్రెస్ చెప్తుంటాను నువ్వు రా అని అంటుంది. తీరా చుస్తే రాహుల్ తన ఇంటికి వస్తాడు. ఎదరుగా స్వప్న చీపురుకట్టతో రెడీగా ఉంటుంది. నీకు పెళ్ళాం పిల్లలున్నా కూడా టీనా అంటూ తిరుగుతున్నావంటూ కొడుతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది అందరు ఇంట్లో నన్ను పిచ్చి దానిలాగా చూస్తున్నారని రుద్రాణి అంటుంది.
తరువాయి భాగం లో రాజ్ బయటకు వెళ్తాడు. రాజ్ వెళ్తున్న కార్ లో జీపీఎస్ పెట్టాను తను ఎక్కడికి వెళ్లిన తెలుస్తుందని తన పేరెంట్స్ తో యామిని చెప్తుంది. కావ్య కోసం ఆఫీస్ కి వెళ్తాడు రాజ్. ఏంటి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళాడు.. తనని గుర్తు పడుతారు కదా అని యామిని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
