Biggboss 8 Nominations: మూడో వారం నామినేషన్లో ఎవరున్నారంటే!
on Sep 17, 2024
బిగ్బాస్ హౌస్లో మూడో వారం నామినేషన్లకి 'ట్రాష్ బిన్' (చెత్త బుట్ట) థీమ్ పెట్టారు. ఈ ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులని మీరు భావిస్తారో ఆ వేస్ట్ను త్వరగా బయటికి పంపండి అంటూ బిగ్బాస్ చెప్పాడు. ఇక చీఫ్లు అయిన కారణంగా అభయ్, నిఖిల్ను ఎవరు నామినేట్ చేయకూడదంటూ బిగ్బాస్ చెప్పాడు. ఇక సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఆ వ్యక్తిపై చెత్త పోసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. నామినేషన్ల ప్రక్రియను సీతతో స్టార్ట్ చేసింది.
సీత ముందుగా యష్మీని నామినేట్ చేసింది. గేమ్స్లో డామినేటింగ్గా, చీఫ్గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటు యష్మీని సీత నామినేట్ చేసింది. ఇక నువ్వు గెలవాలనే కసి నాకు నచ్చుతుంది.. కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చలేదు.. నీ అగ్రెషన్ నాకు అసలు నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది సీత. తర్వాత విష్ణుప్రియకి ఛాన్స్ రాగా ముందుగా ప్రేరణను నామినేట్ చేసింది. సాక్స్ టాస్కులో సంచాలక్గా ఫెయిల్ అయ్యావంటూ చెప్పుకొచ్చింది. ఇక దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయడంతో కాసేపు ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఇక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది విష్ణుప్రియ. మీరు చీఫ్గా ఉన్నప్పుడు మీ టీమ్ గేమ్స్ ఫెయిర్గా ఆడలేదు.. అలానే పనులు ఎక్కువగా మా టీమ్కే ఇచ్చారంటూ విష్ణు చెప్పింది. దీనికి లేదు మిగిలిన పనుల కంటే కుకింగే ఎక్కువ పని.. అందుకే మీకు తక్కువ ఇవ్వాలనే అన్నీ మీ పైన వేశానంటూ పిచ్చి సమాధానం చెప్పింది యష్మీ. మణికంఠ తన ఫస్ట్ నామినేషన్ యష్మీకి వేశాడు. నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావ్.. అలానే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదా అంటూ దూరిపోయావ్.. అంటూ మణికంఠ అన్నాడు. దీనికి యష్మీ ఏదో సమాధానం చెబుతుంటే మణి సీరియస్ అయ్యాడు. నువ్వు మాట్లాడేటప్పుడు పూర్తిగా వినండి.. మీ ఆటిడ్యూడ్ చూపించకండి.. అంటూ మణి అన్నాడు. దీనికి నేనంటే ఇదే.. ఈ టూ వీక్స్ నేను చీఫ్గా ఉన్నా.. నేను మాట్లాడాలి.. నా టీమ్ కోసమైన నేను మాట్లాడాలి. నీకు అది మైక్రో మేనేజ్మెంట్గా అనిపిస్తే నీ చీఫ్ దగ్గర చెప్పుకో.. నీకు చీఫ్ అంటే ఏంటి మెంబర్ అంటే ఏంటనే క్లారిటీనే రాలేదంటూ యష్మీ అరిచింది. నేను మాట్లాడేటప్పుడు ఆపొద్దు యష్మీ అంటూ మణికంఠకి బీపీ తన్నేసింది. దీనికి యష్మీ టాపిక్ డైవర్ట్ చేసి మణికంఠని బుక్ చేసే ప్రయత్నం చేసింది. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానంటే నువ్వు డ్రామాలు చేస్తావు చూడు.. హౌస్లో నా దగ్గరికొచ్చి ఫ్రెండ్గా.. అది డ్రామా, నువ్వు ఫేక్ అని నేను అర్థం చేసుకోలేదంటూ యష్మీ అంది. దీనికి నాకు ఫ్రెండ్లో ఒక క్వాలిటీ నచ్చకపోతే నేను రెయిజ్ చేస్తానంటూ మణికంఠ అనగానే నువ్వేంటి బొక్క రెయిజ్ చేసేదంటు యష్మీ బూతులు మాట్లాడింది. నువ్వు మంచిగా మాట్లాడు నేను మాట్లాడతాను.. అంటూ మణికంఠ అంటే నేను తప్పైతే బయట ఆడియన్స్ చూసుకుంటారు. నువ్వు ఫేక్.. నేను మాట్లాడేటప్పుడు మాట్లాడేందుకు నీకు ఆ దమ్ములేదా.. నువ్వు ఫేక్ పర్సన్.. అంటూ యష్మీ అంది. ఆ తర్వాత అగ్రెషన్ రీజన్తో పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ
ప్రేరణ మొదటిగా సీతను నామినేట్ చేసింది. నువ్వు గేమ్కి కావాల్సిన దాని కంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావ్ అంటూ వింత రీజన్ చెప్పింది. దీనికి సీత కూడా గట్టిగానే వాదించింది. ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ. రాత్రి పక్కన పెట్టిన ఐదు గుడ్లలో నువ్వు రెండు ఎగ్స్ తినేశావంటూ నామినేషన్ వేసింది. ఇది నాకు సెల్ఫిష్ అనిపించిందంటు ప్రేరణ అంది. దీనికి నవ్వుకున్న విష్ణు.. నీకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కూడా వేస్ట్.. ఒకసారి నాకు కర్రీ కూడా ఉంచకుండా నువ్వు తిన్నావ్.. అప్పుడు పక్కవాళ్ల గురించి నువ్వు ఆలోచించావా అంటూ విష్ణుప్రియ అంది. ఆ తర్వాత విష్ణుప్రియ, మణికంఠలను ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. ఇక యష్మీ, ప్రేరణలను నబీల్ నామినేట్ చేయగా సీత, నైనికలను పృథ్వీ నామినేట్ చేశాడు.
Also Read