టార్గెట్ చేసిన హౌస్మేట్స్.. జైలులో కాజల్!
on Oct 9, 2021
'బిగ్ బాస్-5' హౌస్లో మెంబర్స్లో మెజార్టీ సెక్షన్ ఆర్జే కాజల్ను టార్గెట్ చేశారా? ఎక్కువ మంది ఆమెను వరస్ట్ పర్ఫార్మర్గా పేర్కొనడం చూస్తుంటే... అదే సందేహం కలుగుతోంది. దీనికి యాంకర్ రవి వేసిన ప్లాన్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవాలి.
శ్రీరామచంద్ర జైలుకు వెళ్లకుండా చూడడం కోసం కాజల్ మీద వరస్ట్ పర్ఫార్మర్ ముద్ర వేయాలని రవి తన టీమ్ సభ్యులతో డిస్కషన్ పెట్టాడు. వాళ్లంతా అదే విధంగా చేశారు. దాంతో కాజల్ జైలుకు వెళ్లక తప్పలేదు. కాజల్ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నదని రవి అభిప్రాయపడ్డాడు. వరస్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ అవుతుందని తనకు కూడా తెలుసునని అతడు చెప్పాడు.
ఎవరిని దోషిగా అనుకుంటున్నారో చెప్పమని హౌస్లోని సభ్యులను బిగ్ బాస్ అడిగాడు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు జైలుకు వెళ్లాలి. కాజల్కు శ్వేత, హమీద, శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, రవి ఓటు వేయడంతో ఆమె జైలుకు వెళ్ళింది.
ఓటింగ్ ప్రక్రియలో రవి, కాజల్ మధ్య వాగ్వాదం జరిగింది. తనపై కాజల్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని రవి అన్నాడు. 'ఎవరి మీద చెయ్యి ఎత్తకు. నొప్పి అయితది. పద్ధతి తెలుసుకో' అని రవి చెబుతుంటే... 'నువ్వు నాకు పద్ద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు' అని కాజల్ కౌంటర్ ఇచ్చింది. అయినా రవి తగ్గలేదు. 'నీ పీరియడ్లు నీ క్లాసులో పెట్టుకో ఈడ కాద'ని అన్నాడు.
Also Read