" స రి గ మ ప " స్టేజి చాలా లక్కీ అన్న ఆది సాయికుమార్
on Jun 29, 2022
తెలుగు వారికి ఎంతో ఇష్టమైన సింగింగ్ రియాలిటీ షో " స రి గ మ ప " ఇప్పుడు " స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ షో " గా అందరినీ అలరిస్తోంది. కోటి, ఎస్పీ శైలజ, స్మిత, అనంత శ్రీరామ్, గీత మాధురి, రేవంత్, శ్రీకృష్ణ, సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌండిన్య జడ్జెస్ గా, మెంటార్స్ గా ఈ షోలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ షో కొత్త ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బోనాలు జాతర స్పెషల్ ఎపిసోడ్ గా వచ్చే వారం మన ముందుకు రాబోతోంది. ఇక ఈ ప్రోమోలో బోనాలు ఎత్తుకుని శ్రీముఖి, శైలజ, స్మిత, గీతామాధురి, లేడీ కంటెస్టెంట్స్ అందరు స్టేజి మీదకు వస్తారు.
బోనాలు దింపి శ్రీముఖి బోనాలు జాతర శుభాకాంక్షలు అంటూ మంచి జోష్ తో అనౌన్స్ చేస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా బోనం ఎత్తి బయలెల్లు పాటకి సాకేత్ కొమాండూరి, అరుణ్ కౌండిన్య ఇద్దరూ సూపర్ గా డాన్స్ చేసి అలరిస్తారు. వాళ్లకు తోడుగా కోటి కూడా డాన్స్ చేసి సందడి చేశారు. ఇక ఈ షోకి సాయికుమార్ తనయుడు ఆది వచ్చాడు. ఈ స్టేజి అంటే తనకు చాలా లక్కీ అని చెప్పాడు. ఎందుకంటే ఒకే ఒక లోకల్ సాంగ్ ఈ స్టేజి మీద పాడేసరికి అది ఫుల్ వైరల్ అయ్యింది అని చెప్పారు. "నిన్ను నిన్నుగా ప్రేమించిన" అనే పాటకు శ్రీముఖి, ఆది కలిసి జోడి డాన్స్ పెర్ఫార్మ్ చేశారు.
ఆది ప్రేమ కావలి, లవ్లీ, సుకుమారుడు వంటి మూవీస్ తో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆది లిస్టులో అమరన్, కిరాతక, క్రేజీ ఫెలోస్, తీస్ మార్ ఖాన్, అతిథిదేవోభవ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాబోయే జులైలో మూడు చిత్రాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. హిట్స్ , ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది. చాలా కాలంగా ఆది లిస్టులో ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక ఇప్పుడు వరుసగా రాబోతున్న చిత్రాల్లో ఏ చిత్రంతో హిట్ కొడతాడో వేచి చూడాలి.
Also Read