టాయిలెట్ పేపర్ మీద ప్రేమ కవిత్వం చెప్పిన ప్రిన్స్
on Jan 5, 2024
.webp)
ఆహా ఓటిటి ప్లాటుఫారంపై డగ్ అవుట్ అనే షో నవదీప్ హోస్ట్ గా ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఇప్పుడు ఈ షో సీజన్ 1 కాస్త గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వారం షోకి తేజస్విని మడివాడ, నటుడు ప్రిన్స్ వచ్చారు. హోస్ట్ నవదీప్ వాళ్ళతో మంచి గేమ్ ఆడించాడు. ఐతే ఇందులో ఒక టాస్క్ లో భాగంగా "టాయిలెట్ పేపర్ కి లవ్ లెటర్ రాయాలి" అని రావడంతో ప్రిన్స్ దాని మీద లవ్ కవిత చెప్పాడు.
"ఓ టాయిలెట్ పేపరు..ఓ టాయిలెట్ పేపరు..ఎంత సన్నగా ఉన్నావో, ఎంత తెల్లగా ఉన్నావో, అవసరం వచ్చినప్పుడల్లా నేను నిన్ను ఎన్ని విధాలుగా వాడుకున్నానో యూఎస్ లో..ఒక్కోసారి నిన్ను చూసి ఎంత చిరాగ్గా ఫీలయ్యానో నాకే తెలుసు...టాయిలెట్ పేపరు...టాయిలెట్ పేపరు... నిన్ను మడతపెట్టి జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాను అవసరం వచ్చినప్పుడు నిన్ను వాడుకుంటాను ..ఐ లవ్ యు టాయిలెట్ పేపర్" అని ప్రిన్స్ కవిత చెప్పాక అదే టాయిలెట్ పేపర్ మీద తేజు కవిత చెప్పింది "డియర్ టాయిలెట్ పేపర్..నిన్ను దానికి తప్ప ఇంకా చాలా వాటికి వాడాను, లిప్ స్టిక్ తుడుచుకోవడానికి , మేకప్ తీసేయడానికి, ఎవరూ లేనప్పుడు జంగల్ లో ఒక్కదాన్నే తిరుగుతున్నప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నావ్..సో ఎప్పటికీ నేను కూడా నీతో ఉంటా..ఇట్లు తేజస్విని" అని ఫన్నీగా లవ్ ఎక్స్ప్రెస్ చేసింది. ఇక ఎపిసోడ్ ఎండింగ్ వరకు అన్ని రకాల టాస్కుల్లో తేజు, ప్రిన్స్ పోటీ పడ్డారు.. లాస్ట్ లో తేజు కప్పు గెలిచింది. తేజు ఇటీవలి కాలంలో "అర్దమయ్యిందా అరుణ్ కుమార్" మూవీలో నటించింది. అలాగే ప్రిన్స్ బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ గా చేసాడు అలాగే త్రి రోజెస్, ది అమెరికన్ డ్రీం, డిజె టిల్లు మూవీస్ లో నటించాడు. హోస్ట్ నవదీప్ న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



