రష్మిని వదిలేసి రాశి ఖన్నాతో సుధీర్ రొమాన్స్
on Jun 27, 2022
'పక్కా కమర్షియల్' టీం ప్రమోషన్స్ జోరు చూస్తూ ఆడియన్స్ హోరెత్తిపోతున్నారు. ఐతే ఇటీవల 'థాంక్యూ దిల్ సే' అనే ప్రోగ్రాంకి ఈ టీం వచ్చి సందడి చేసింది. ఇక హోస్ట్స్ సుధీర్, శ్రీముఖి ఇద్దరూ మస్త్ ఎంటర్టైన్ చేశారు. గోపీచంద్ తో కలిసి శ్రీముఖి "ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన" అంటూ పాట పాడింది. 'నేను ఒక్క లైన్ అడిగితే పాడలేదు' అని సుధీర్ అనేసరికి 'లేడీస్ అడిగినప్పుడు పాడకపోతే ఫీల్ ఐపోతారు' అన్నాడు గోపీచంద్. 'మా వైపు రాశిఖన్నా గారు ఉన్నారుగా' అని సుధీర్ అనేసరికి "నా కోసం ఒక పాట పాడతావా" అంటూ రాశి చేతిలో చెయ్యేసి మరీ అడిగేసరికి సుధీర్ మస్త్ సిగ్గుపడిపోయాడు. 'నేను ఎప్పుడూ అమ్మాయిల్ని టచ్ చేయను' అని సుధీర్ అన్న మాటకు అందరూ నవ్వేశారు. "అడిగా అడిగా" అంటూ సుధీర్ పాట అందుకొనేసరికి "ఏమడిగావ్?" అంటూ గోపీచంద్ కోరస్ పాడి నవ్వించారు.
ఇక తర్వాత రాశి ఖన్నా "ఏం సందేహం లేదు" పాట అద్భుతంగా పాడి అందరినీ మెస్మరైజ్ చేసింది. గోపీచంద్, శ్రీముఖి ఒక జోడిగా, రాశిఖన్నా, సుధీర్ ఒక జోడిగా డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. సుధీర్, "నాకు అమ్మాయిలను ముట్టుకోవడం అంటే కొంచెం ప్రాబ్లెమ్" అని రాశితో అనేసరికి, "నాకేం ప్రాబ్లెమ్ లేదు" అని సుధీర్ కి కౌంటర్ ఆన్సర్ ఇచ్చింది రాశి ఖన్నా. "ఇప్పుడు ఈ రెండు జోడీలు మధ్య డాన్స్ వార్ జరగబోతోంది" అంటూ శ్రీముఖి చెప్పేసరికి "అమ్మాయిలతో డాన్స్ వేయడం నాకు సిగ్గు" అన్నాడు సుధీర్. "అమ్మాయిలతో కాకుండా అబ్బాయిలతో వేస్తావా ఏమిటి డ్యాన్స్" అన్నాడు మారుతి.
ఇక తర్వాత "జ్వాలా రెడ్డి జ్వాలా రెడ్డి" సాంగ్ కి డాన్స్ వేశారు శ్రీముఖి, గోపీచంద్. తర్వాత రొమాంటిక్ సాంగ్ ఏం సందేహం లేదు పాటకు సుధీర్, రాశీ ఖన్నా ఇద్దరూ చక్కగా డాన్స్ చేసి మంచి ఎనర్జీని అందించారు ఆడియన్స్ కి. ఇక జడ్జి మారుతి స్టేజి మీదకు వచ్చి రొమాంటిక్ సాంగ్ లో రాశి, మాస్ సాంగ్ లో గోపీచంద్ గెలిచారని చెప్పాడు. అలా ఈ షో మొత్తం గేమ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు.
Also Read