సోనియా కుళ్ళు.. నిఖిల్ కన్నీళ్ళు.. ఇదేం పత్తాపారం సామి!
on Sep 12, 2024
బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొ కంటెస్టెంట్ బిహేవియర్ కి బయట ఉన్న వాళ్ళకి మైండ్ పోతుంది. నిన్న మొన్నటిదాకా సోనియా, నిఖిల్ రాసుకొని తిరిగారు. నిన్నటి ఎపిసోడ్ లో దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని చెప్పుకున్నారు.
అసలేం జరిగిందంటే.. హౌస్ లోని కంటెస్టెంట్స్ కి ఫుడ్ లేకుండా బిగ్ బాస్ అన్నీ లాగేసుకుంటే.. నిఖిల్ వాళ్ళకి ఫుడ్ లేదని సోనియా ఏడ్చేసింది. అయితే తను ఏడ్చిందానికి అసలు రీజన్ అదేనా అంటే కాదనే అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్, సోనియా మట్లాడింది టెలి కాస్ట్ చేశాడు బిగ్ బాస్. అందులో ఏం ఉందంటే.. నా వల్ల నీ గేమ్ డిస్టబ్ అవుతుందంటే నాతో నువ్వు ఉండకు.. నేను నీతో ఉండను అని సోనియాతో నిఖిల్ చెప్తాడు. ఆ తర్వాత హౌస్ లో ఫుడ్ కోసం ప్రతీ క్లాన్ నుండి ఒక్కొక్కరిని తీసుకొని గేమ్ ఆడించాడు బిగ్ బాస్.
ఈ టాస్క్ లల్లో గెలిచిన వారికే ఫుడ్ అని చెప్పడంతో అందరు పోటీపడి ఆడారు. ముందుగా యష్మీ టీమ్ గెలిచి రేషన్ను సొంతం చేసుకున్న వెంటనే సోనియా తెగ ఏడ్చేసింది. ఇంతకు గెలిచింది వాళ్ల టీమ్ ఏ అయినా సోనియా ఎందుకేడుస్తుందో ఎవరికి అర్థం కాలేదు. కానీ దానితో మనకేం సంబంధం ఓదార్పు ఇవ్వడమే ముఖ్యం అన్నట్లు వెంటనే సోనియాను దగ్గరికి తీసుకొని అభయ్ నవీన్ ఓదార్చాడు. ఇక సోనియా ఏడుస్తుందని తెలియగానే పరిగెత్తుకొని వచ్చాడు సోనియా ప్రేమికుడు నిఖిల్. కానీ ఏం లేదు.. ఏం లేదు అంటూ నిఖిల్ని పక్కకి పంపేసి మరీ అభయ్ ఓదార్చాడు. ఇక తర్వాత నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు.. తర్వాత పృథ్వీ కూడా సోనియాను ఓదార్చాడు. ఇలా ఎంతమంది ఓదార్చిన సోనియా కన్నీళ్ళు ఆగలేదు. ఆ తర్వాత నిఖిల్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. మణికంఠ ఫుడ్ దొంగతనం చేద్దామని చెప్పిన నా వల్ల కాదని చెప్పేశాడు. మరి వీరి మధ్య ఏం జరుగుతుందో బిబి(Biggboss) ఆడియన్స్ కే తెలుస్తుంది.
Also Read