ENGLISH | TELUGU  
Home  » TV News

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పైకి పుష్ప మూవీ ఫేమ్ జగదీష్

on Feb 8, 2023

పుష్ప మూవీలో అల్లు అర్జున్ పక్కన మూవీ మొత్తం కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగదీష్ అందరికీ గుర్తే. సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఎంత హైలైట్ అయ్యిందో జగదీష్ రోల్ కూడా అంతే హైలైట్ అయ్యింది. కొంత గ్యాప్ తీసుకున్న జగదీష్ ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్ మీదకు రావడానికి సిద్దమయ్యాడు. 'సత్తిగాని రెండు ఏకురాలు' టైటిల్ కాగా "అమ్ముతడా..సస్తడా" అనేది టాగ్ లైన్. ఈ మూవీలో జగదీష్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అభినవ్ దండా దర్శకత్వం వహించగా పుష్ప', మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఉన్నారు. ఈ మూవీని హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు ప్రాంతంలో చిత్రీకరించారు. 

త్వరలో ఆహా ఓటిటి ప్లాట్ఫార్మ్ మీద ఈ మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ వారు మాట్లాడుతూ "విభిన్న కథా చిత్రాలను ఆదరించే మా ప్రేక్షకుల కోసం ఈ మూవీని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఓటిటి ప్లాట్ఫార్మ్ ద్వారా  కొత్త ప్రయోగాలు చేసి ఆడియన్స్ ని మరింత మెప్పించే అవకాశం ఉంది. దాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం. కంటెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ అందించడమే ఆహా లక్ష్యం. ఇది ఒక పవర్ ఫుల్ స్టోరీ అందులోనూ ఈ మూవీలో మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయబోతోంది. ఆడియన్స్ కి బాగా నచ్చుతుందని మా అభిప్రాయం. లీడ్ రోల్ జగదీష్ తో పాటు ఊహించని మలుపులు, మంచి కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి.  వెన్నెల కిషోర్, బిత్రి సతి, మోహన శ్రీ సురగా, రాజ్ తిరందాసు, అనీషా దామా వంటి ఎంతోమంది ఈ సినిమాలో కనిపించబోతున్నారు. " అని చెప్పారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.