Karthika Deepam2: దీపని కత్తితో పొడిచేసిన నరసింహా.. షాక్ లో వంటలక్క అభిమానులు!
on Sep 21, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం-2'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-155 లో.. శ్రీధర్ గురించి నిజం తెలుసుకున్న పారిజాతం, జ్యోత్స్నలు ఒకరిని కలవాలని కార్లో వెళ్తారు. వాళ్ళు ఒక దగ్గర ఆగగా.. అక్కడికి దాస్ వస్తాడు. ఏంటమ్మా రమ్మన్నావని పారిజాతాన్ని అడుగగా.. రేయ్ ముందు కాశీగాడికి వేరే అమ్మాయితో పెళ్లి చేసెయ్రా.. నేను ఒక మంచి అమ్మాయిని చూస్తాను.. తనతో చేసేద్దామని అంటుంది. అదేంటమ్మా.. వాడు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాడని నీకు తెలుసు కదా.. అలా ఎలా మాట్లాడతావని దాస్ అంటాడు. గ్రానీ అసలు విషయం చెప్పమని జ్యోత్స్న అనగా.. అంటే అది.. దాసు.. మన కాశీగాడు ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు.. మీ శ్రీథర్ బావ కూతురని పారిజాతం అంటుంది.
ఏంటమ్మా నువ్వు అనేది? శ్రీథర్ బావకి కూతురుందా? చాలా మంచి విషయం ఇది. అయిన కాశీగాడు.. చాలా మంచి పనిచేశాడు. స్వప్న నా మేనకోడలా? అయిన శ్రీథర్ బావకి కార్తీక్ ఒక్కడే కొడుకు అనుకున్నానే అని దాస్ అంటాడు. మాకు ఈ రోజే తెలిసిందిరా శ్రీథర్కి కూతురుందని పారిజాతం అంటుంది. ఊరుకో అమ్మా నీకు తెలియకపోవడమేంటని దాస్ అనగానే.. అయ్యో నిజమేరా.. స్వప్న కాంచన కూతురు కాదు.. శ్రీథర్ రెండో భార్య కూతురని పారిజాతం అనగానే.. దాస్ షాక్ అవుతాడు. రేయ్ ఇదంతా నిజమేరా.. మాకు ఈ రోజే తెలిసింది. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే మాత్రం.. నీ కూతురు పెళ్లి ఆగిపోతుందంటూ తన భయాన్ని మొత్తం కొడుక్కి చెప్పి.. కాశీ, స్వప్నల పెళ్లి ఆపేయమని చెప్తుంది. అదెలా కుదురుతుందమ్మా.. వాళ్లు ప్రేమించుకున్నారని దాస్ అంటాడు. అయితే ఒక పని చెయ్.. ముందు కిందా మీద పడి జ్యోత్స్న, కార్తీక్ల పెళ్లి చేస్తాను.. ఆ తర్వాత శ్రీథర్ విషయం బయటపెట్టి.. కాశీతో స్వప్న పెళ్లి చేస్తాను.. అప్పుడు వాడికి కుటుంబం ఉన్నట్లుంది కదా అంటూ రిక్వెస్ట్గా మాట్లాడుతుంది. దాంతో సరే అమ్మా నువ్వే ఈ కథకు సూత్రదారివి.. ఇక మీద కూడా నువ్వే నడిపించు.. నేను మాత్రం కాశీని తన పెళ్లి విషయంలో కొంత కాలం ఆగమని మాత్రం చెబుతానని దాస్ అంటాడు. సరేరా సంతోషం.. నువ్వు వెళ్లు.. మరో విషయం ఈ విషయాలేవీ కాశీ గాడికి కూడా చెప్పకని పారిజాతం అంటుంది. సరే అనేసి దాసు వెళ్లిపోతాడు. ఆ తర్వాత గ్రానీ.. ఆయన అందరికీ చెప్పేస్తే అని జ్యోత్స్న అడుగుతుంది. అంటుంది. తండ్రి అన్న అభిమానం, ప్రేమ నీకు దాస్ మీద లేకపోవచ్చు కానీ.. నువ్వు కూతురివి అన్న ప్రేమ అభిమానం నా కొడుక్కి ఉన్నాయిలే.. అలా చేయడు.. రా అని చెప్పి జ్యోత్స్నని పారిజాతం ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది.
మరోవైపు శ్రీథర్ మందు తాగుతూ రగిలిపోతూ ఉంటాడు. కావేరీ వచ్చి.. ఎందుకు స్వప్నను బాధపెడుతున్నారని నిజం చెప్పడంతో.. మన స్వప్న బాసు.. బాసు.. అనేది ఎవరో తెలుసునా నా కొడుకు కార్తీక్. స్వప్న ప్రేమించింది ఎవరినో తెలుసా? మా పారిజాతం అత్తయ్య మనవడ్ని.. దాస్ కొడుకుని.. ఈ పెళ్లి జరిగితే నేను ఆ ఇంట్లో దోషిగా నిలబడాలి.. దీపకు మన పెళ్లి విషయం తెలుసు. మన అదృష్టం బాగుండి కార్తీక్కి ఆమె చెప్పలేదు. చెప్పి ఉంటే వాడు ఈ పాటికే నా కాలర్ పట్టుకునేవాడు. కార్తీక్ ముందు మన కథ తెలిస్తే నన్ను అసహ్యించుకుంటాడు. మా మామగారు నన్ను చంపేస్తాడు. నిజం తెలిస్తే కాంచన కచ్చితంగా చచ్చిపోతుంది. అదే జరిగితే కార్తీక్ కన్ను క్షమించడు. ఈ నిజాలన్నీ స్వప్నకు తెలిస్తే తను కూడా నన్ను ఛీ కొడుకుతుంది. ఇన్ని ప్రమాదాలకు కారణం స్వప్న, కాశీల పెళ్లి. అందుకే కూతురు బాధపడుతుందని తెలిసి కూడా మౌనంగా ఉండాల్సి వస్తోంది కావేరీ అని ఇప్పటిదాకా తను దాచిన నిజాలన్నీ కావేరీకి శ్రీధర్ చెప్తాడు. శ్రీధర్ మాటలు విని కావేరీ షాక్ అవుతుంది. మరోవైపు కార్తీక్ ఇంటి నుంచి తన ఇంటికి దీప వెళ్లబోయే దారిలో కాపు కాస్తాడు నరసింహా. దీప వచ్చినట్లు తనని వెనుక నుంచి పొడిచి చావ్వే అని నేల మీద పారేసినట్లు కల గంటాడు నరసింహా. ఇక కాసేపటికి తేరుకుని ఇది కలా? అయినా జరిగేది ఇదే కదా.. చంపేస్తాను దాన్ని.. రానీ అంటూ రగిలిపోతూ ఉండగానే.. దీప అటుగా వస్తుంది. దీపకు ఎదురుగా కత్తి పట్టుకుని నిలబడతాడు నరసింహా. దీప మొదట షాక్ అవుతుంది. కత్తితో పొడవబోతుంటే.. నా కంటపడింది నువ్వు చావడానికేరా అని కత్తి పట్టినచేతిని దీప ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read