Eto Vellipoyindhi Manasu : అటు ప్రేయసి, ఇటు కసాయి తల్లి కన్నింగ్ ..
on Oct 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -229 లో.... రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటే.. అప్పుడే నందిని వచ్చి రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అవును రామలక్ష్మిని బయటకు తీసుకొని వెళ్ళావా.. సర్ ప్రైజ్ ఇచ్చావా.. తను హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది కదా అని నందిని అంటుంది. అవును నీ గురించి చెప్పు.. నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లే.. నువ్వు కూడా ఎవరినైనా చేసుకోమని సీతాకాంత్ అంటాడు. లేదు నేను ప్రేమించింది ఒక్కరినే అంతే.. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికి అర్ధం లేదని నందిని చెప్తుంది.
ఫైల్ పై సంతకం చేయించుకొని నందిని వెళ్తుంటే.. నా మాటలతో హర్ట్ చేసుంటే సారీ అని సీతాకాంత్ చెప్తాడు.ఆ తర్వాత అభి, రామలక్ష్మిలు కలిసి ఉన్న ఫోటోని శ్రీలత తీసుకొని, శ్రీవల్లికి ఇచ్చి రామలక్ష్మి ర్యాక్ లో పెట్టమని చెప్తుంది. ఏం చేస్తున్నారని శ్రీవల్లి అడుగుతుంది. తర్వాత చెప్తానని శ్రీలత అంటుంది. శ్రీవల్లి వెళ్లి రామలక్ష్మి ర్యాక్ లో ఫోటో పెడుతుంది.ఆ తర్వాత సీతాకాంత్ ఇంటికి వస్తాడు. ఇలా ఉండొద్దని చెప్పాను కదా... నువ్వు ఇలా ఎందుకుంటున్నావో నాకు తెలుసని సీతాకాంత్ అనగానే నిజం తెలిసిపోయిందేమోనని రామలక్ష్మి టెన్షన్ పడుతుంది. త్వరగా వచ్చి నీతో కలిసి డిన్నర్ చెయ్యలేదని ఇలా ఉన్నావని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి నార్మల్ అవుతుంది. ఆ తర్వాత రామలక్ష్మి కింద పడుకుంటుంది. ఎందుకు బెడ్ పై పడుకోవచ్చు కదా అని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది.
మరొకవైపు నందిని దగ్గరికి అభిని తీసుకొని వస్తుంది హారిక. నందిని రామలక్ష్మి సీతాకాంత్ ల ఫోటోని చూపించి.. నాకు సీతా కావాలి. నీకు ఇంకా రామలక్ష్మి అంటే ప్రేమ ఉందని సీతాకాంత్ ని నమ్మించాలని అభికి నందిని డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత ఎందుకు రామలక్ష్మి ఇలా బెహేవ్ చేస్తుందని సీతాకాంత్ అనుకుంటాడు. అప్పుడే శ్రీలత వచ్చి.. రామలక్ష్మికి చీర తీసుకొని వచ్చి ఇస్తానని అనగానే.. పడుకుందని సీతాకాంత్ అంటాడు. సరే నువ్వు తీసుకొని వెళ్లి రామలక్ష్మి ర్యాక్ లో పెట్టమని శ్రీలత చెప్తుంది. దాంతో సీతాకాంత్ తన ర్యాక్ లో పెడతాడు. అప్పుడే రామలక్ష్మి, అభి ఫోటో కన్పిస్తుంది. అది చూసి ఈ ఫోటో రామలక్ష్మి చూస్తే బాధపడుతుందంటూ సీతాకాంత్ చింపేస్తాడు. అది చూసి శ్రీలత డిస్సపాయింట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం అందరు టిఫిన్ చేస్తుంటారు. సీతాకాంత్ రావడంతో.. రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకరికొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read