Brahmamudi: విషం కలిపిన పసరు మందుని తాగిన కావ్య.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!
on Jan 2, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-919 లో... రాజ్ బావ నాకు కావాలని రేఖ అనగానే దానికి రాహుల్ ఒప్పుకొని కావ్య కడుపులో బిడ్డని లేకుండా చేయాలని చెప్తాడు. రేఖని ఆ ఇంటికి కోడలుగా చెయ్యాలని రాహుల్ ప్లాన్ చెయ్యగా.. చాలా థాంక్స్ అన్నయ్య అని రేఖ అంటుంది. మీరు ఇద్దరు ఒకే అంటే చేసేదేముంది నా కూతురు ఈ ఇంటికి కోడలు అవుతుంది.. అంతకంటే ఏముందని రుద్రాణి అంటుంది.
మరొకవైపు ఇద్దరు అక్కాచెల్లెలు అప్పు, కావ్య కడుపుతో కూర్చొలేక నిల్చొలేక ఇబ్బందిపడుతారు. దాంతో అప్పు, కావ్య ఇద్దరు తమ భర్తల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా రెస్ట్ తీసుకొమ్మంటే మాకు ఇబ్బందిగా ఉందని అంటారు.
ఇక రాత్రి రుద్రాణికి పసరు మందు వైద్యుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మందు తీసుకొని వచ్చానని చెప్పగానే సరే ఉండు వస్తున్నానని రుద్రాణి వెళ్తుంది. అప్పుడే తనకి ప్రకాష్ ఎదురుపడుతాడు. దాంతో రుద్రాణి భయపడుతుంది. కానీ ప్రకాష్ నిద్రలో నడుస్తాడు అది చూసి రుద్రాణి రిలాక్స్ అవుతుంది. ఇక రుద్రాణి బయటకు వెళ్లి పసరు మందు తీసుకొని వస్తుంది.
మరుసటి రోజు ప్రకాష్, సుభాష్ ఆఫీస్ కి వెళ్ళడానికి త్వరగా టిఫిన్ చేస్తుంటారు. దాంతో రాజ్ వచ్చి ఎవరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తాడు.
మరొకవైపు రాజ్ గదిలోకి రుద్రాణి, రేఖ వెళ్లి పసరు మందు తను తాగే ఆయుర్వేద మందులో కలుపుతారు. ఈ దెబ్బతో కావ్య బిడ్డ ఉండదని రుద్రాణి, రేఖ అనుకుంటారు.
ఆ తర్వాత ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అన్నావ్ రాజ్ ఎక్కడ అని ప్రకాష్ అనగానే.. రాజ్, కళ్యాణ్ కలిసి కొన్ని చీటీలు రాసి అందులో ఏది వస్తే అది చెయ్యాలని చెప్తారు.
తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఆయుర్వేద మందు ఇస్తాడు. అది కావ్య తాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



