Brahmamudi : భార్య సీఈఓ.. భర్త ఎంప్లాయ్.. ఇదెక్కడి మాస్ రా మామ!
on Oct 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -545 లో.....అందరు ఇంటికి వచ్చాక ఎందుకు అలా చేసావంటూ రాజ్ ని అపర్ణ, ఇందిరాదేవిలు తిడతారు. మీరు నన్ను అనే హక్కుని కోల్పోయారు. వాళ్ళతో కలిసి నాటకం ఆడి నన్ను మోసం చేశారు. ఇలాంటి ప్రయత్నం చెయ్యకండి.. నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని రాజ్ చెప్పి వెళ్ళిపోతాడు. మీరు చేసేది న్యాయం అయినప్పుడు ఇలా నాటకం ఎందుకు నిజాయతీగా ప్రయత్నం చేయండి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని ఇందిరాదేవి, అపర్ణలకి సీతారామయ్య చెప్తాడు.
మరొకవైపు కనకంతో కావ్య ఎందుకు ఇలా చేసావ్ అమ్మ అని అంటుంది. మీ అమ్మ కరెక్ట్ చేసింది మీరు దూరంగా ఉంటే అందరు సైలెంట్ గా ఉన్నారు కానీ మీ అమ్మ మిమ్మల్ని కలపాలని చూసిందని కృష్ణమూర్తి అంటాడు. ఇంకా అలాంటి ప్రయత్నం చెయ్యకు.. ఇక నేను ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని కావ్య అంటుంది. ఆ తర్వాత రాహుల్, రుద్రాణి లు కలిసి రాజ్, కావ్యలు దూరమైనందుకు హ్యాపీగా ఉంటారు. జరిగింది డిస్కషన్ చేసుకుంటుంటే... అప్పుడే స్వప్న వచ్చి మీరు గ్రేట్ అంటూ పొగిడినట్లే పొగిడి ఇద్దరికి క్లాస్ తీసుకుంటుంది. ఆ తర్వాత అపర్ణ, ఇందిరాదేవి, కనకం ముగ్గురు ఒక దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటారు. మా కంటే ఎక్కువ నీకే అవమానం జరిగిందని కనకంతో ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత అపర్ణ వాళ్ళని కలపడానికి మరొక ప్లాన్ చేస్తుంది. వాళ్ళిద్దరు ఆఫీస్ లో కలుసుకోవాలి కావ్యని ఆఫీస్ కి పంపించాలి.. అందుకు ఒప్పించాలని అపర్ణ అంటుంది.
మరొకవైపు రాజ్ ఆఫీస్ కి వెళ్తాడు. అందరిని వర్క్ సరిగా చెయ్యడం లేదని తిడతాడు. శృతిని పిలిచి డిజైన్ అడుగుతాడు.. డిజైన్ అవ్వకున్నా అయిందని చెప్పడంతో రాజ్ కోప్పడి.. నాకు వెంటనే డిజైన్ కావాలని అంటాడు. మరొకవైపు అపర్ణ, ఇందిరాదేవి, కనకంలు కావ్య దగ్గరికి వస్తారు. తరువాయి భాగంలో నువ్వు ఆఫీస్ కి వెళ్ళాలని అపర్ణ అనగానే.. ఏ తప్పు వెతికి ఎప్పుడు పంపిస్తారో తెలియదని కావ్య అంటుంది. ఎంప్లాయిగా వెళ్తే అలా కానీ సీఈఓగా వెళ్తే తీసే ఛాన్స్ ఉండదని అపర్ణ అనగానే.. కావ్య షాక్ అవుతుంది. సీఈఓ చైర్.. అందులో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలని రాజ్ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
Also Read