ఒక అమ్మాయితో భర్త.. సీసీ ఫుటేజ్ లో...
on May 5, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -401 లో....డ్రింక్ చేస్తున్న రుద్రాణి, రాహుల్ ల దగ్గరికి స్వప్న వచ్చి.. కాసేపు మాట్లాడి డాన్స్ చేద్దామా అని అనగానే వాళ్ళు కూడా చేస్తామని అంటారు. వాళ్ళని డాన్స్ చేసేలా చేసి వాళ్ళు చూడకుండా వాళ్ళు తాగుతున్న డ్రింక్ లో స్వప్న ఏదో కలుపుతుంది. ఆ తర్వాత ఆ డ్రింక్ వాళ్లకి ఇచ్చి తాగమని చెప్తుంది ఇద్దరు ఫుల్ గా డ్రింక్ చెయ్యగానే వాళ్ళ చేత నిజం చెప్పిస్తుంది.
ఆ తర్వాత డబ్బులేం చేశారని స్వప్న అడుగగా.. నా గదిలోనే ఉంచాను.. ఇదిగో కీ కూడా నా దగ్గరే ఉందని చూపించగానే రుద్రాణిని డైవర్ట్ చేసి కీ తీసుకొని స్వప్న డబ్బులు తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం సేట్ దుగ్గిరాల ఇంటికి వచ్చి స్వప్నకి సారీ చెప్పి ఇంటి పత్రాలు ఇస్తాడు. అసలు అవి మీ దగ్గరికి ఎలా వచ్చాయంటూ స్వప్న అడుగుతుంది. ఎవరో తీసుకొని వచ్చారు లే అమ్మ అంటూ సేట్ అనగానే.. చెప్పండి అని అడుగుతారు. ఎక్కడ వాళ్ళ పేరు చెప్తాడోనని రాహుల్ సేట్ ని తీసుకొని బయటకు వెళ్తాడు. ఏంటి ఇలా చేసావని సేట్ ని రాహుల్ అడుగుతాడు. రాత్రి అమ్మోరు వచ్చారు. నేను నీకు ఇచ్చిన కోటి రూపాయలు.. నావి నాకు ఇవ్వండి లేదంటే మీరే పత్రాలు ఇచ్చారని ఇంట్లో వాళ్ళకి చెప్తానని రాహుల్ కి సేట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.
మరొకవైపు అప్పు చెప్పిన లొకేషన్ కి కావ్య వెళ్తుంది. ఆ తర్వాత అప్పు కూడా వస్తుంది. తనతో ఇద్దరు కానిస్టేబుల్ ని తీసుకొని వస్తుంటే వాళ్ళని ఎందుకు తీసుకొని వచ్చావంటు కావ్య అడుగుతుంది. వాళ్ళు నిజమైన పోలీసులు కాదు. గెటప్ వేసి తీసుకొని వచ్చాను. వాడు భయపడి నిజం చెప్తాడని అప్పు అంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే అక్కడ రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్న అతను ఉంటాడు. అతన్ని నిజం చెప్పమని కావ్య బెదిరిస్తుంది. చెప్తానంటూ అతను భయపడుతుంటాడు. తరువాయి భాగంలో రాజ్ ని బ్లాక్ మెయిల్ చేసినతను.. రాజ్ తన దగ్గరికి వచ్చినట్టు, ఒక అమ్మాయితో మాట్లాడడం నేను విన్నానని చెప్తాడు. ఆ తర్వాత కావ్య ఆఫీస్ కి వెళ్లి సీసీ టీవీఫుటేజ్ చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read