లాస్యకు సాయికుమార్ క్రీమ్ బిస్కెట్!
on Sep 23, 2021
బుల్లితెర వీక్షకులను ప్రస్తుతం ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షోల్లో 'బిగ్ బాస్' సీజన్ ఫైవ్ ఒకటి. యాంకర్ రవి, యూట్యూబర్లు షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతు, సింగర్ శ్రీరామచంద్ర, యాక్టర్లు లహరి, హమీదా తదితరులు ఉన్నారు. 'బిగ్ బాస్ 4'లోనూ యాంకర్, సింగర్, యాక్టర్, న్యూస్ రీడర్ ఇలా అన్ని వర్గాల వాళ్లు ఉన్నారు. అందులో నలుగుర్ని 'వావ్' షోకి తీసుకొచ్చారు.
యాంకర్ లాస్య మంజునాథ్, యాక్టర్ కమ్ సింగర్ అండ్ ర్యాపర్ నోయల్ సేన్, యూట్యూబర్ మెహబాబ్, న్యూస్ రీడర్ జోర్దార్ సుజాత నెక్స్ట్ వీక్ 'వావ్' షోలో సందడి చేయనున్నారు. నలుగురిలో లాస్య గతంలో ఒకసారి 'వావ్'కి వెళ్లారు.
"లాస్య... ఆల్రెడీ 'వావ్'కి వచ్చినట్టు ఉన్నావ్ కదా?" అని సాయికుమార్ అడిగితే... "ఎప్పుడో మూడేళ్ళ క్రితం సార్" అని లాస్య చెప్పింది. "అప్పుడు అలాగే ఉన్నావ్. ఇప్పుడు అలాగే ఉన్నావ్. ఎప్పుడూ అలాగే ఉంటావ్ ఏమో! రాయచోటి... కడప... పవర్" అని సాయికుమార్ అనడంతో లాస్య చాలా హ్యాపీ ఫీల్ అయింది. అయితే, మైక్ లో 'క్రీమ్ బిస్కెట్' అని వాయిస్ రావడంతో 'కాదు కాదు' అంటూ లాస్య నవ్వేసింది. షోలో 'బిగ్ బాస్ 4' బ్యాచ్ ఎంత సందడి చేశారో వచ్చే వారం తెలుస్తుంది.