అశ్వగంధ ఈజ్ బ్యాక్.. యష్మీతో లవ్ ట్రాక్!
on Oct 7, 2024
గౌతమ్ కృష్ణ అలియాస్ అశ్వథ్దామా 2.0.. మళ్ళీ ఇప్పుడు 4.0 గా ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్ లో తన ఓవర్ అగ్రెషన్ తో చాలాసార్లు నాగార్జునతో చివాట్లు తిన్నాడు. అనుకోకుండా కొద్దీ రోజులకే ఎలిమినేట్ అయి సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చి.. అశ్వథ్థామా 2.0 ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద పెద్ద డైలాగ్స్ వేసాడు. అసలు విషయానికీ వస్తే వచ్చిన రెండు వారాలకే సర్దేసుకొని బయటకొచ్చేశాడు. అయితే సీక్రెట్ రూమ్ నుండి హౌస్ లోకి వెళ్ళాక గౌతమ్ పై తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. అశ్వత్థామ 2.0 కాదు నువ్వు అశ్వగంధ 2.0 అని అప్పుడు చాలా ట్రోల్స్ గౌతమ్ కృష్ణ మీద వచ్చాయి.
హౌస్ లో వావ్ అనే పర్ఫామెన్స్ లేకపోయిన శుభశ్రీ రాయగురుతో లవ్ ట్రాక్ నడపడం వల్ల కాస్త ఎక్కువ రోజులే హౌస్ లో కొనసాగాడు. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున సర్ ప్రైజ్ అంటూ.. ప్రియాంక జైన్ మాట్లాడిన వీడియోని చూపిస్తాడు. అందులో ప్రియాంక ఏం చెప్పిందంటే.. బాగా ఆడు అల్ ది బెస్ట్, అప్పుడు 2.0 ఇప్పుడు 4.0 అని చెప్తుంది. ఇక ఆ వీడియో తర్వాత నాకు బిగ్ బాస్ ఇచ్చిన చెల్లి సర్ తను అని గౌతమ్ కృష్ణ అంటాడు.ఆ తర్వాత గౌతమ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. మొహానికి మాస్క్ పెట్టుకొని వెళ్తాడు. అందరు ఎవరు ఇతను అంటూ కన్ఫ్యూషన్ లో ఉంటారు. ప్రేరణ మాత్రం అశ్వత్థామ 2.0 అని అనగానే మాస్క్ తీస్తాడు.
ఇక అందరిని పరిచయం చేసుకొని పాజిటివ్ గా మాట్లాడతాడు. బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ఆటతీరు, మాటతీరు చూసి వచ్చాడు. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వొచ్చు. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు అంతా కూడా మాజీ కంటెస్టెంట్స్. వాళ్ళ గేమ్ కూడా ఆల్రెడీ అందరికి తెలుసు. గత సీజన్ లో శుభశ్రీతో లవ్ ట్రాక్ నడిపిన గౌతమ్.. ఇప్పుడు యష్మీతో లవ్ ట్రాక్ నడిపించే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు హౌస్ లో ప్రస్తుతం రెండు గ్రూప్ లో ఉన్నాయ్.. వీరిలో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఎంటర్టైన్మెంట్ చేస్తారో చూడాలి మరి.
Also Read