వేణుస్వామి పూజలు కిర్రాక్ ఆర్పీపై పని చేస్తాయా..?
on Jul 6, 2024
అసలేం జరుగుతుంది.. బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి బయట సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ చూస్తుంటే బుర్ర హీటెక్కిస్తుంది. ఎందుకంటే ఏడ లేని సరుకంతా ఈడే ఉన్నట్టు ఎక్కడ లేని స్టఫ్ అంతా సోషల్ మీడియాలోనే ఉంటుంది.
సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో ఇరవై మంది కంటెస్టెంట్స్ ఉంటేనే.. వామ్మో ఎవర్రా వీళ్లంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు సీజన్-8 లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయంట. బిగ్ బాస్ సీజన్-7 సూపర్ హిట్ అయ్యింది. ఈ సీజన్-7 విన్నర్గా పల్లవి ప్రశాంత్, రన్నర్గా అమర్ దీప్ నిలిచారు. అయితే స్పై అండ్ స్పా బ్యాచ్ మధ్య జరిగే ప్రతీ ఫైట్ , ప్రతీ వీక్ ఉత్కంఠభరితంగా సాగడం, హౌస్ లోని వాళ్ళంతా పోటాపోటీగా గేమ్స్ , టాస్కు లు ఆడటంతో అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ సీజన్-8 సన్నాహాలు మొదలైపోయాయి. కంటెస్టెంట్స్ కోసం తెగ శ్రమిస్తున్నారంట మేకర్స్.
సోషల్ మీడియాలో కంటెస్టెంట్స్ లిస్ట్ లో బాగా వినిపిస్తున్న వాళ్ళు కొందరున్నారు. ఫార్మర్ నేత్ర, కిర్రాక్ ఆర్పీ, సుప్రిత, ముక్కు అవినాష్, కుమారీ ఆంటీ, కుషిత కళ్ళాపు ల పేర్లు ఎక్కువగా వినిపించగా.. గత రెండు రోజులుగా జ్యోతిష్కుడు వేణుస్వామి పేరు కూడా వినిపిస్తుంది. సెలబ్రిటీల గురించి ముందుగానే చెప్పి అవి నిజమ అవ్వడంతో చాలామంది హీరోయిన్లు అతని దగ్గరికి రావడం పూజలు జరిపించడం చేస్తుంటారు. అయితే తన భార్య కూడా శ్రీవాణి కూడా 'మంగళవారం' మూవీ సినిమాలోని థీమ్ మ్యూజిక్ ప్లే చేసి వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఇద్దరిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొస్తారా లేక వేణుస్వామి ఒక్కడినే తెస్తారా అనే నెట్టింట డిబేట్ జరుగుతుంది. ఒకవేళ తీసుకొస్తే అతనికి అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తారంట. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారిన వేణుస్వామిని తీసుకొస్తారా లేదా రెమ్యునరేషన్ ఎక్కువగా ఇవ్వాలని డ్రాప్ అవుతారా చూడాలి మరి.
Also Read