సీత స్టాండ్ తీసుకుంది కరెక్టే.. నబీల్ కి తెలియని స్ట్రాటజీ అదే!
on Oct 13, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఆరో వారం ముగింపుకి వచ్చేసింది. ఇక ఈ వారం మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. వారిలో కొత్త కంటెస్టెంట్స్ గంగవ్వ, మెహబూబ్ కూడా ఉన్నారు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ ఫైర్ లో రాకుండా కూల్ గా కన్పించారు. దాంతో హౌస్ మేట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఇక వచ్చీ రాగానే మణికంఠను మెనీ కంఠ అంటూ ఏదో చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత విష్ణుప్రియ లేపి ఏదో అడుగబోతుంటే.. వారం మొత్తం టాస్క్లో ఇరగదీసి పర్ఫామ్ చేసేసరికి అలిసిపోయా సర్ అని విష్ణుప్రియ అంది. అబ్బో ఏం చేసి అలిసిపోయావని నాగార్జున అనగానే.. హోటల్ టాస్క్ లో మసాజ్ చేసి.. కాళ్ళు నొక్కాను సర్.. చాలా కంటెంట్ ఇచ్చాను సర్ అని విష్ణుప్రియ తన బాధ చెప్పింది. అంతేనా... లేదంటే పృథ్వీ మాల్దీవ్స్ ఆఫర్ రిజిస్టర్ కాలేదనా? అని నాగార్జున అడిగాడు. అప్పుడు పృథ్వీ లేచి నిలబడి.. విష్ణూ నీకు చెప్పాను కదా.. పెళ్లి చేసుకుని మల్దీవ్స్ వెళ్దాం అన్నా కదా అని విష్ణుప్రియకి నాగార్జున గుర్తుచేశాడు. ఆ తర్వాత.. అవినాష్, టేస్టీ తేజాలు గులాబ్ జామ్లు తిన్న వీడియోను చూపించి.. వాళ్లతో గులాబ్ జామ్లను తినిపించాడు నాగార్జున. కొన్ని తిన్నాక వాళ్ళు వదిలేశారు. ఇక వాళ్ళు గులాబ్ జామ్ లు దొంగచాటుగా తినకుంటే మీ టీమ్ గెలిచేది కదా అని నబీల్ ని నాగార్జున అడుగగా.. రెండు తిన్నామని చెప్పారు సర్ అని నబీల్ చెప్పుకొచ్చాడు.
సీత రాయల్స్ టీమ్ దగ్గర దొంగతనం చేయడాన్ని.. తప్పు పట్టి ఆమెతో బలవంతంగా డబ్బులు ఇప్పించారు. ఆమె చేసింది తప్పే కాదని నాగార్జున అన్నాడు. సీత డబ్బులు ఇవ్వడం వల్లే.. ఆ టీమ్ గెలిచింది.. రాయల్స్ టీమ్ వాళ్లు ప్లాన్ చేసి.. సీత దగ్గర డబ్బులు తీసుకుంటేనే గెలుస్తామని వాళ్లకి తెలుసు.. అందుకే ఆ డబ్బులు తీసుకున్నారు. కానీ ఓజీ టీమ్ మాత్రం వాళ్లు అడగ్గానే ఇచ్చేశారు. అయిన సీత తీసుకున్న స్టాండ్ మీద నిలబడి ఉంటే.. ఆ టీమ్ గెలిచేది. నువ్వు మీ టీమ్ మాట విని మిస్టేక్ చేశావ్.. నీ స్టాండ్ మీద నిలబడి ఉంటే మీ టీమ్ గెలిచేది అని సీతతో నాగార్జున చెప్పి.. ఆ తర్వాత నబీల్కి నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ చెప్పనంతవరకూ అది ఫెయిర్ కిందే లెక్క.. ఇది గుర్తుపెట్టుకుని ఆట ఆడండి అని నాగార్జున గైడెన్స్ ఇచ్చాడు.
Also Read