పృథ్వీ గడ్డానికి ఆఫర్ ఇచ్చిన నాగార్జున.. నిన్న హీరో నేడు జీరో!
on Oct 19, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ఏడో వారం క్లైమాక్స్ కి వచ్చేసింది. హౌస్ లో ఈ వారం ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి పెరిగింది. ఎందుకంటే హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ కి ఓటింగే లేదు. శనివారం నాటి ప్రోమో కోసం బిబి ఆడియన్స్ తో పాటు కామన్ పీపుల్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అందులోను ఈ వారం జరిగిన టాస్క్ లో చాలా గొడవలు జరిగాయి. నిఖిల్, గౌతమ్, పృథ్వీల ఇష్యూలు చాలా ఉన్నాయి. ఇక మణికంఠే అన్నీ గొడవలకి కారణమని అందరికి తెలిసిందే. అయితే శనివారం నాడు నాగార్జున ఎవరి మీద ఫైర్ అవుతాడనే క్యూరియాసిటితో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ప్రోమో రానే వచ్చింది. నాగార్జున రావడమే ఫుల్ ఫైర్ లో వచ్చాడు. ప్రోమోలో అసలేం ఉందంటే.. నిన్న హీరో నేడు జీరో అంటు మొదలెట్టాడు.
బిబి టైమ్స్ అంటు కొన్ని ఆర్టికల్స్ తీసుకొచ్చాడు నాగార్జున. నిన్న హీరో నేడు జీరో ఎవరని అడుగగా.. హరితేజ తన పాయింట్లు చెప్పింది. ఆట అంటే అగ్రెసివ్ ఒక్కటే కాదంటూ హరితేజ అంది. ఇక బూడిదలా మారుతున్న నిప్పు అంటు మరో టైటిల్ ఎవరికో అడిగాడు నాగార్జున. హౌస్ లో హెయిర్ కట్ గురించి అడిగాడు. అవినాష్ యాభై వేల గురించి చేసుకున్నాడని రోహిణి అడుగగా.. యాభై వేలు కాదు.. ముందుకు వచ్చాడు అది గ్రేట్ అంటూ అవినాష్ ని పొగిడేశాడు నాగ్ మావ. ఆ తర్వాత పృథ్వీ గడ్డం తీసుకుంటే మూడు వారాల పాటు నామినేషన్ లో ఉండవని నాగార్జున ఆఫర్ ఇవ్వగా.. ఆలోచనలో పడ్డాడు పృథ్వీ. అయితే ఇంకా హౌస్ లో ఎవరికి కోటింగ్ ఇచ్చాడో.. ఎవరిని మెచ్చుకున్నాడో తెలియాలంటే మరో ప్రోమో కోసం చూడాల్సిందే.