Kirrak seetha elimination : కిర్రాక్ సీత ఎలిమినేషన్.. టేస్టీ తేజ నామినేషన్ వల్లేనా!
on Oct 13, 2024
ఏదీ ఎక్కడ వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటుంది. ఏదీ ఎంతవరకు ఉంటుందో అంతే ఉంటుంది. అదే బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం ఆడియన్స్ కి హౌస్ మేట్స్ కి తెలుస్తుంది.
ఈ సీజన్ మొదలవ్వడమే పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ఇక గత వారం ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి వచ్చారు. వారిలో టేస్టీ తేజ స్పెషల్. ఎందుకంటే టేస్టీ తేజ గత సీజన్ లో వేసిన ప్రతీ నామినేషన్ ఓ సెన్సేషన్. దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజా మూర్తి, సందీప్ మాస్టర్ వీళ్లంతా.. టేస్టీ తేజా బాధితులే. మనోడు నామినేట్ చేశాడంటే వాళ్లు ఎలిమినేట్ కావాల్సిందే. ఇతను ఎలిమినేట్ అయ్యేవరకూ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు హౌస్ నుంచి వెళ్లిపోయేవారు. టేస్టీ తేజా తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయితే అప్పటి వరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం కిర్రాక్ సీతని, మణికంఠని నామినేషన్ చేశాడు టేస్టీ తేజ. అయితే మణికంఠకి ఈ ఒక్క నామినేషన్ పడటంతో అతను నామినేషన్ లిస్ట్ లో లేడు. కిర్రాక్ సీత మాత్రం డేంజర్ జోన్ లో ఉంది.
ఈ వారం నామినేషన్ లో మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మొదటగా పృథ్వీ సేవ్ అవ్వగా, సెకెంఢ్ యష్మీ సేవ్ అయ్యింది. ఇంకా నామినేషన్ లో నలుగురు ఉన్నారు. నేడు జరగబోయే ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలుస్తుంది. అయితే ఓటింగ్ ప్రకారం మెహబూబ్, కిర్రాక్ సీత నామినేషన్ లో లీస్ట్ లో ఉన్నారని వారిద్దరి మధ్య స్వల్ప తేడా ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికి వచ్చిన అప్డేట్ ప్రకారం కిర్రాక్ సీత ఎలిమినేషన్ అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే నేడు జరగబోయే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.