Karthika Deepam 2: కీలక సాక్ష్యం కనిపెట్టిన దాస్.. ఓ చేతిలో విషం, మరో చేతిలో తాళి!
on Oct 13, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-174 లో.. దీప మెడలోని తాళిని నరసింహా పట్టుకుని గొడవ పడుతుంటాడు. దీప తాళి ఊడి నరసింహా చేతికి రావడం.. నరసింహా చేతి నుంచి జారి మంటల్లో పడటం.. అది కాలిపోవడంతో దీప ఆవేశంగా నరసింహను కిందకు తోసేసి.. అక్కడే ఉన్న బండరాయిని కిందపడిన నరసింహా మీద ఎత్తేస్తుంది. వెంటనే నరసింహా పారిపోతూ పారిపోతూ.. ఒసేయ్ దీపా నిన్ను వదలనే అంటూ పారిపోతాడు. ఇక వెంటనే తన తాళిని తీసుకోవడానికి మంటలవైపు వెళ్ళి పుల్లల్ని లాగుతుంది దీప. అయితే అనసూయ వేగంగా వచ్చి ఆగమంటుంది. అత్తయ్యా నా తాళి.. నా తాళి అని దీప చాలా ఏడుస్తుంది. నీకు నా కొడుక్కి కోర్టు విడాకులు ఇచ్చింది కానీ.. ఈ రోజే అసలైన విడాకులు ఆ దేవుడు ఇచ్చాడే నీకు.. ఏడవకు.. పోనీ వదిలెయ్ అని అనసూయ ధైర్యం చెప్పి కోడల్ని, శౌర్యను ఇంటికి తీసుకెళ్తుంది.
మరోవైపు పార్క్ లో ఓ టేబుల్ మీద దాస్ కూర్చొని ఆలోచిస్తుంటాడు. జరిగిపోయిన దాన్ని, దేన్నీ మనం మార్చలేం.. కానీ తల్చుకుంటే జరగబోయేదాన్ని మార్చొచ్చు కదా.. నేను మా అమ్మతో అన్న మాటని ఎలాగైనా నిజం చెయ్యాలి.. ఆ వర్షం పడిన రోజు పాపని తీసుకుని వెళ్లిపోయిన మనిషి గుర్తున్నాడు కానీ అతను ఎవరో ఎక్కడుంటాడో.. ఏం చేస్తాడో కూడా తెలియదు.. మరి వారసురాల్ని ఎలా కనిపెట్టాలని అనుకుంటాడు. ఈలోపు పార్క్లో ఓ ఆర్టిస్ట్ దాసు దగ్గరకు వచ్చి.. కొంచెం సేపు అలానే చూసి మళ్లీ వెళ్లి బొమ్మ వేస్తుంటాడు. వీడు ఎవడు.. నన్నే చూస్తున్నాడు. నేను నిజం ఎవరికీ చెప్పకుండా మా అమ్మ ఎవరినైనా సెట్ చేసిందా ఏంటని దాస్ మనసులో అనుకుంటాడు. ఇంతలో ఆ ఆర్టిస్ట్ మళ్లీ రావడంతో ఈసారి గట్టిగా పట్టుకుని.. కాలర్ అందుకుని.. నిన్ను ఎవరు పంపారురా అని దాస్ అంటాడు. సర్ ఆగండి.. నేను ఆర్టిస్ట్ని.. పార్క్కి వచ్చిన వాళ్ల బొమ్మలు గీయడం నా హబీ సర్.. కావాలంటే చూపిస్తాను రండి అని అతను అంటాడు. ఏది చూపించు అనడంతో కాస్త ముందుకు తీసుకెళ్లి, దాసు బొమ్మని చూపించి.. అద్భుతం అనిపించుకుంటాడు. అవును నీకు అన్ని రకాల బొమ్మలు వచ్చా? అంటే నేను ఒక వ్యక్తి రూపురేఖలు చెబుతాను.. బొమ్మలా గియ్యగలవా అని దాస్ అడుగుతాడు. ఐదొందలు అవుతుంది సర్.. మీరు వారి రూపురేఖలు ఎంత క్లియర్గా చెబితే బొమ్మ అంత బాగా వస్తుందని అతను అంటాడు. చూసి పాతికేళ్లు దాటినా మరిచిపోలేదు నేను ఆ వ్యక్తిని అనుకుంటూ వెయ్యి రూపాయలు తీసి.. మొత్తం 12 వందలు చేతికి ఇచ్చి.. బొమ్మ బాగా గియ్యి అంటూ కుబేర్ రూపు రేఖలు చెప్తాడు.
మరోవైపు నాకు బావ కావాలి, ఆస్తి కావాలంటూ పారిజాతంతో గొడవేసుకుంటుంది జ్యోత్స్న. ఇక కాశీ, స్వప్నల అన్యోన్యంగా ఉంటారు. నాన్న ఎక్కడ అని కాశీ అడగ్గా.. బయటకెళ్ళాడని స్వప్న చెప్తుంది. అప్పుడే దాస్ వస్తాడు. కుబేర్ ఫోటో చూస్తూ.. అసలైన వారసురాలు బయటపడే రోజు దగ్గర పడినట్లుంది.. లేదంటే నేను పోలికలు చెప్పడమేంటీ.. నా మనసులో ఉన్నట్లే ఈ బొమ్మ గీయడమేంటి.. నువ్వెవరో ఎక్కడుంటావో.. నీ వివరాలు ఏంటో వెంటనే కనిపెట్టాలని మనసులో ఫిక్స్ అవుతాడు దాస్.
ఏంటి నాన్నా అది అని కాశీ అడుగగా.. డ్రాయింగ్రా అంటూ తన బొమ్మను చూపిస్తాడు. అది చూసి స్వప్న, కాశీలు బాగుందని అంటారు. పార్క్లో ఓ ఆర్టిస్ట్ వేశాడని దాస్ చెప్తాడు. మరి అదేంటని కాశీ అడగ్గా.. ఇది కూడా డ్రాయింగేరా అని దాస్ అంటాడు దాసు. మరి అది ఎవరిదిని కాశీ అడుగుతాడు. ఈ కథను మలుపు తిప్పేవాడిది అనేసి.. స్వప్న చేతిలోని తన బొమ్మను తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు దాస్. కథను మలుపు తిప్పేవాడు అంటే అని స్వప్న అనగానే.. నాన్న అంతేలా అప్పుడప్పుడు అలానే అర్థం కాకుండా మాట్లాడతాడు.. సరే దిల్ బై అని స్వప్నకి చెప్పేసి కాశీ వెళ్లిపోతాడు. నిజానికి దాసు గీయించిన బొమ్మ కుబేర్ది. కుబేర్ ఫొటో దీప ఇంట్లో దండేసి ఉంది. మరోవైపు ఓ చేతిలో విషం, మరో చేతిలో తాళితో.. కార్తిక్ దగ్గరికి వస్తుంది జ్యోత్స్న. ఈ క్షణమే తాళి కడతావా? లేక విషం తాగి చావమంటావా అని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read