Eto Vellipoyindhi Manasu : దగ్గరికి తీసుకోవాలనుకున్న భర్త.. వద్దని పొమ్మన్న భార్య!
on Oct 16, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -227 లో.... సీతాకాంత్ దగ్గరికి కలిసి భోజనం చెయ్యాలని నందిని వస్తుంది. దానికి సీతాకాంత్ కూడా సరేనంటాడు.. ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు. పెళ్లి అయి ఇన్ని రోజులు అవుతుంది. శుభవార్త ఏమైనా చెప్పేది ఉందా లేదా.. మీరు నాకు ఒక పాపనో బాబూనో ఇస్తే వాళ్ళతో ఆడుకుంటాను. నాకు ఎటు ఎవరు లేరు కదా.. వాళ్ళతో అయిన నా బాధ తిరిపోతుందంటూ మనసులో కుళ్ళు పెట్టుకొని నందిని మాట్లాడుతుంది. నీ కోసం రామలక్ష్మి ఎంత చేస్తుంది. నువ్వు తనకోసం టైమ్ స్పెండ్ చెయ్ అని సీతాకాంత్ తో నందిని చెప్తుంది. నిజమే రామలక్ష్మి నాకోసం చాలా చేసింది. తనకి తెలియకుండా ఈ రోజు బయటకు తీసుకొని వెళ్ళాలని సీతాకాంత్ అనుకుంటాడు.
మరొకవైపు రామలక్ష్మి డాక్టర్ అన్న మాటలు గుర్తుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి.. మనం బయటకు వెళదామని చెప్తాడు. ఎక్కడికి అని రామలక్ష్మి అడుగుతుంది. చెప్తే గాని రావా అని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత నందిని పెళ్లికూతురులాగా ముస్తాబవుతుంది. హరిక వచ్చి.. ఎందుకిలా రెడీ అయ్యావని అడుగుతుంది. ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యి సీత పక్కన కూర్చోవాలి కదా అంటు అనగానే.. ఎందుకు ఇలా ఆశలు పెట్టుకుంటున్నావ్ అన్నట్లుగా హారిక అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మిని సీతాకాంత్ ఒక ఇంటికి తీసుకొని వచ్చి.. చీర ఇచ్చి కట్టుకొని రమ్మని పంపిస్తాడు.
దాంతో మీకెలా ఈ విషయం చెప్పాలంటూ రామలక్ష్మి ఏడుస్తుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. అసలు మీరేం చేస్తున్నారు చెప్పండి అని అడుగుతుంది. దాంతో శ్రీలత తన చేసిన ప్లాన్ గురించి చెప్తుంది. మీరు సూపర్ అత్తయ్య.. ప్లాన్ బాగుందంటూ శ్రీవల్లి మెచ్చుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి చీర కట్టుకొని సీతాకాంత్ దగ్గరికి వస్తుంది. రామలక్ష్మికి సీతాకాంత్ తన మనసులో ఉన్నా ప్రేమని చెప్తాడు. ఆ తర్వాత రామలక్ష్మిని సీతాకాంత్ గదిలోకి తీసుకొని వెళ్తాడు. తనపై చెయ్యి వెయ్యగానే రామలక్ష్మి చెయ్ తీస్తుంది. దాంతో సీతాకాంత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read