Eto Vellipoyindhi Manasu : బయటకి వెళ్తే ప్రాణ నష్టమే.. భార్య దగ్గర మాట తీసుకున్న భర్త!
on Oct 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -217 లో......రామలక్ష్మి ఆఫీస్ లో కన్పించిన రౌడీ ఫోటో ని మాస్క్ తో బొమ్మ గీసి.. సిరికి చూపిస్తుంది. ఇతనే వదిన ఆ రోజు నా నగలు దొంగతనం చెయ్యాలని చూసింది.. వీడే అని చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అదంతా చూస్తున్న శ్రీలత టెన్షన్ పడుతుంది. ఎందుకంటే వాడు ఆఫీస్ కి ఎందుకు వచ్చాడు.. వాడిని పట్టుకుంటే అంతా నిజం భయటపడుతుందని రామలక్ష్మి అనుకుంటుంది. అదంతా విన్న శ్రీలత.. ఇది ఆ ఫోటో పట్టుకొని కనుక్కుంటే తీగ లాగితే డొంక కదిలినట్లు అవుతుందని శ్రీలత ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది.
మరుసటి రోజు ఉదయం సీతాకాంత్ లేచేసరికి తన బొమ్మ గీసి ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడే సోఫాపై పడుకున్న రామలక్ష్మి వంక ప్రేమగా చూస్తుంటే రామలక్ష్మి నిద్ర లేస్తుంది. ఆ తర్వాత ఇంటికి స్వామి పంపారంటూ తన అసిస్టెంట్ వస్తాడు. రామలక్ష్మి సీతాకాంత్ లు వచ్చాక ఈ తాయత్తు కట్టుక్కోండి.. స్వామి మీ కోసం పూజలు చెయ్యడానికి వెళ్లారు. తను వచ్చేవరకు మిమ్మల్ని బయటకు రావొద్దని చెప్పాడని అంటాడు. వస్తే ఏమవుతుందని శ్రీలత అడుగుతుంది. నష్టం జరుగుతుందిని చెప్పి వెళ్తాడు. శ్రీలత నవ్వుతుంటే మీరు నవుతున్నారంటే ఇది మీ ప్లాన్ అని అర్ధం అవుతుందని శ్రీవల్లి అంటుంది. ఇదేంటి ఇలా అయింది ఆ రౌడీ ఎవరో కనుకుందామనుకుంటే ఇలా అయింది. అత్తయ్య కావాలనే ఇలా చేసి ఉంటారా అని రామలక్ష్మి అనుకుంటుంది.
మరొకవైపు నందిని డ్రైవింగ్ చేస్తూ సీతాకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకునే వరకు నీకు ఎదరు పడొద్దనుకున్నా కానీ నిన్ను చూడాలని ఉంది వస్తున్నాను.. నువ్వేం అన్న భరిస్తానని నందిని సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది. మరొకవైపు రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. అప్పుడే నందిని వస్తుంది. స్వామి చెప్పిన కీడు ఈ నందిని అనుకుంటా అని అనుకొని అక్కడే ఆగు అంటూ నందినిని తిట్టి పంపిస్తాడు సీతాకాంత్. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెళ్తాడు. ఎక్కడికి వెళ్లారు టాబ్లెట్ తీసుకోండని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్ళాకని రామలక్ష్మి దగ్గర మాట తీసుకుంటాడు సీతాకాంత్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read