Eto Vellipoindi Manasu: ఎత్తుకు పైఎత్తు.. సవతి తల్లిని ఇంట్లో నుండి గెంటించేస్తా చూడు!
on Oct 13, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-225 లో నందిని తన పీఏ హారికతో మాట్లాడుతుంది. అదే సమయంలో సందీప్, శ్రీవల్లిలతో శ్రీలత మాట్లాడుతుంటుంది. ఎలాగైనా రామలక్ష్మిని ఇంట్లో నుండి గెంటేసి నందినిని ఇంట్లోకి రప్పించాలని శ్రీలత అంటుంది. మరి తను కూడా నా ఆస్తి, నా పిల్లలు అని ఉంటుంది కదా అని శ్రీవల్లి అనగానే..మన చేతులకి మట్టి అంటకుండా సీతా చేతులతోనే నందినిని బయటకు గెంటించేస్తా అయితే ఈసారి సీతా ఆస్తితో పాటు నందిని ఆస్తి కూడా వస్తుందని శ్రీవల్లి, సందీప్ లతో శ్రీలత అంటుంది.
ఇక మరోవైపు హారిక, నందిని మాట్లాడుకుంటారు. అసలే ఆ శ్రీలత జిత్తులమారి నక్క.. రామలక్ష్మిని బయటకు గెంటేసినట్టుగా నిన్ను కూడా గెంటేస్తే ఎలా అని నందినిని హారిక అడుగుతుంది. సవతి తల్లిలా తను చేసే కుట్రలన్నీ సీతాకాంత్ కి సాక్ష్యాలతో సహా చూపించి వాళ్ళందరిని ఇంట్లో నుండి గెంటించేస్తా అని నందిని అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే.. శ్రీలత, శ్రీవల్లి వస్తారు. కాసేపు వాళ్ళిద్దరు రామలక్ష్మి మాటకి మాట అనేసుకుంటారు. ఇక రామలక్ష్మి అంటే సీతాకాంత్ కి ఇష్టమే అనేలా కవరింగ్ చేస్తుంది రామలక్ష్మి.
ఇక ఆఫీస్ లో ఉన్న సీతాకాంత్ దగ్గరికి నందిని వస్తుంది. తన ఎమోషనల్ డ్రామా మొదలెడుతుంది. నేనంటే ఇష్టపడే వాళ్ళు లేరు.. నాకిష్టమైన వాళ్ళే నన్ను అవమానిస్తూ.. పదే ఒదే అనుమానిస్తుంటే నేనిక్కడ ఉండలేను ఫారెన్ వెళ్లిపోతా అని నందిని అంటుంది. ఏమైందని సీతాకాంత్ అడుగగా.. రామలక్ష్మిని , నిన్ను చంపాలని నేను చూసానా.. ఎందుకు నా మీద స్పై చేశావని అంటుంది. అదేదో పారపాటున జరిగిందని సీతాకాంత్ అంటాడు. ఇక నందిని తన బాధనంతా చెప్పుకొని వెళ్ళిపోతుంటే సీతాకాంత్ తన చేతిని పట్టుకుంటాడు. తన ప్లాన్ సక్సెస్ అయ్యిందని నందిని మనసులో అనుకొని హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read