Brahmamudi : కోర్టులో కీలక సాక్ష్యం.. శిక్ష నుండి అతను తప్పించుకుంటాడా!
on Jul 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -454 లో.....రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. ఏం ఆలోచిస్తున్నారని అడుగుతుంది. ఇంట్లో అందరు కళ్యాణ్ కి శిక్ష పడుతుందని భయపడుతున్నారని అంటాడు. ఒకసారి అనామిక దగ్గరికి వెళ్లి మాట్లాడుదామని కావ్య అనగానే.. ఇంత జరుగుతున్నా కళ్యాణ్ అనామికలని ఒకటి చెయ్యాలని ఎలా అనిపిస్తుందని రాజ్ అనగానే.. ఒకటి చెయ్యడం పక్కన పెడితే శిక్ష నుండి బయటపడెయ్యాలని కావ్య అంటుంది. నేను రాను వెళ్తే నువ్వు వెళ్ళని రాజ్ అంటాడు.
ఆ తర్వాత అనామిక దగ్గరికి కావ్య వెళ్తుంది. నాకు తెలుసు ఆ ఇంటినుండి రాజీకి వస్తారని అనామిక అనగానే.. నాకు తెలుసు నువ్వు అలా అనుకుంటావని అని కావ్య అంటుంది. ఎందుకు వచ్చావని అనామిక పొగరుగా అడుగగా.. నీ తోడి కోడలిని.. నీ కంటే పెద్దదాన్ని నిల్చోపెట్టి, కనీసం కూర్చొమని అనకుండా పొగరు లగా కాళ్ళు మీద కాలు వేసుకొని ఉన్నావ్.. దీన్ని బట్టే తెలుస్తుంది నీకు మళ్ళీ ఆ ఇంటికి వచ్చే ఆలోచన లేదని కావ్య అంటుంది. మరి రాను కళ్యాణ్ నే ఇక్కడికి రప్పించుకుంటానని అనామిక అంటుంది. నువ్వు కేవలం మీ పుట్టింటి అప్పు లు తీర్చడానికే ఇదంతా చేసావని క్లియర్ గా తెలుస్తుందని కావ్య అనగానే.. అవును మరి నా భర్త బిజినెస్ లకి రాజ్ కావాలి కోట్లు తీసుకొని వచ్చి నాకు ఇవ్వాలని అనామిక అంటుంది. ఆ రోజు అప్పుల వాళ్ళు వచ్చి పెళ్లి జరగనివ్వమంటే మా ఆయన మీకు రెండు కోట్ల అప్పు తీర్చాడని కావ్య అంటుంది. రేపు కోర్టులో చూసుకుందామంటూ అనామిక పొగరుగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు ఉదయం కావ్య, రాజ్ వాళ్ళు కోర్టుకి వస్తారు. అప్పు ని తీసుకొని కనకం, కృష్ణమూర్తి కూడా వస్తారు. మీడియా వాళ్ళు అప్పుని ప్రశ్న లతో అవమానిస్తారు. ఆ తర్వాత కోర్టు లోపలికి వెళ్ళాక జడ్జి వచ్చి.. మీకు కలిసి ఉండాలని ఉందా అని అడుగుతాడు. ఉంది కానీ ఈ గొడవలకి కారణమైనా అప్పు, కళ్యాణ్ కి శిక్ష పడాలని అనామిక అంటుంది. తరువాయి భాగంలో ఈ కేసు లో బలమైన సాక్ష్యలతో ఒకరున్నారు వారే కావ్య అని లాయర్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read