Brahmamudi: అల్లుడు సూటిగా అడిగేసరికి అత్త షాక్.. ట్విస్ట్ మీద ట్విస్ట్!
on Oct 13, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-539 లో.. ఇందిరాదేవి, అపర్ణ ఒకవైపు, ప్రకాశం, ధాన్యలక్ష్మి మరోవైపు.. ఆ పక్కనే సుభాష్ కూర్చుని ఉంటారు. ఆ వెనుక సోఫాలో స్వప్న కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజ్ బాధగా కనకం ఇంటి నుంచి వస్తాడు. రాజ్ రావడం రావడమే.. క్షమించడంలో మానవత్వం ఉంటుంది మమ్మీ అని రాజ్ అంటాడు. మానవత్వం ఉన్నవాళ్లే క్షమించగలుగుతారు నాన్నా అని అపర్ణ అంటుంది. మనిషికి, మానుకి తేడా అదేరా అని ఇందిరాదేవి అంటుంది. మిగిలిన వాళ్లకేం అర్థం కాదు. ఇంతలో పైనుంచి రుద్రాణీ, రాహుల్ కిందకు వస్తుంటారు. ఇప్పుడు నేను స్పందించకపోతే.. ఏ సహాయం అందికపోతే ఎలా అని రాజ్ కోపంగా అంటాడు. అక్కడున్న ఎవరికీ ఏమీ అర్థం కాదు. చాలు నాన్నా చాలు.. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయావో అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా అని అపర్ణ అంటుంది. రేపు మా అత్తగారైన శ్రీమతి కనకం.. మా మామగారైన శ్రీమాన్ కృష్ణమూర్తి గార్ల 25వ పెళ్లి రోజు.. నా చేతుల మీదగా గ్రాండ్గా సెలబ్రేట్ చెయ్యాలనుకుంటున్నానని రాజ్ అంటాడు. అపర్ణా దేవి, ఇందిరాదేవి తమ ప్లాన్ ఫలించినందుకు సంతోషిస్తే.. మిగిలిన ప్రకాశం, సుభాష్, స్వప్న మరింత ఆనందంగా చూస్తారు.
ఇంతలో రుద్రాణి గిర్రున కళ్లు తిరిగి రాహుల్ మీద పడిపోతుంటే.. రాహుల్ పట్టుకుని మమ్మీ మమ్మీ అంటూ ఉంటాడు. రా కూర్చో కూర్చో అని పక్కనే సోఫాలో కూర్చోబెట్టి వాటర్ జల్లుతాడు. రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి ముగ్గురు ఎన్ని అన్నీ రాజ్ పట్టించుకోడు. మంచి నిర్ణయమంటూ ఇటు అపర్ణాదేవి, ఇందిరాదేవి కూడా.. రుద్రాణికి, ధాన్యలక్ష్మికి చురకలు వేస్తారు. దాంతో రుద్రాణి మనసులో.. అమ్మో ఇప్పుడు కానీ నేను వీళ్లతో వెళ్లకపోతే.. రాజ్, కావ్య కలిసిపోతారు. అసలే గుడిలో కలిసిన కావ్య, అపర్ణ వదిన ఏదో ప్లాన్ చేసినట్లున్నారు. అదేంటో తెలుసుకోవాలి.. అందుకైనా నేను వెళ్లాలని మనసులో ఫిక్స్ అయ్యి.. సర్లే మీరంతా పెళ్లి రోజుకి వెళ్తుంటే నేను మాత్రం ఎందుకు ఆగుతాను.. పైగా ఆ ఇంటికి నేను కూడా వియ్యపురాలినే కదా.. వస్తానంటూ రుద్రాణి మాట కలిపేస్తుంది. ఇక రాజ్ ఫిక్స్ కావడంతో ఇంట్లో అంతా మరునాడు పెళ్లి రోజుకి వెళ్లాలని ఫిక్స్ అవుతారు. మరునాడు ఉదయాన్నే కావ్య.. తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్తుంది. వాళ్లొస్తున్నారు.. ఈ రోజైనా అల్లుడు గారు ప్రేమని అర్థం చేసుకో.. అల్లుడిగారితో మంచిగా మాట్లాడమంటూ తెలివిగా ముందే కళావతిని హెచ్చరిస్తుంది కనకం. ఇక అనుకున్నట్లే వాళ్లు అంతా వస్తారు. పెళ్లిరోజు ఏర్పాట్ల గురించి రాజ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో కళావతి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా అన్నట్లు చూస్తుంది.
ఇక రాజ్ ఫోన్ పెట్టెయ్యగానే.. అందరికి అందరూ మారిపోయి.. పండంటి కాపురం ఉమ్మడి కుటుంబం లాంటి సినిమాలు చూపిస్తారేంటని కావ్య అంటుంది. ఇదేం చూశావ్ ముందు ఉంది అసలు పండుగ అనేసి రాజ్ వెళ్లిపోతాడు. ఇక తరువాయి భాగంలో.. కనకం దగ్గరికి రాజ్ వెళ్ళి.. క్యాన్సర్కి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వమని అడుగుతాడు. తన డాక్టర్ స్నేహితులకు పంపిస్తానంటాడు. రాజ్ అలా సూటిగా రిపోర్ట్స్ అడిగేసరికి కనకం షాక్ అవుతుంది. అది బాబు.. అది బాబు అంటూ నసుగుతుంది తప్ప... లేని రిపోర్ట్స్ని ఎక్కడి నుంచి తేను అని మనసులో అనుకుంటుంది. అయితే కనకం ఏం చెప్పి తప్పించుకుందో తెలియదు కానీ.. ఆ గదిలోంచి బయటికి వెళ్లేసరికి.. కావ్య చేతులు కట్టుకుని ఇదా నువ్వు ఆడే నాటకం.. ఇదా రాజ్లో వచ్చిన మార్పుకి కారణం అన్నట్లుగా చూస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read