Brahmamudi : అత్త ప్లాన్ కి అల్లుడు ఢమాల్.. నెక్స్ట్ అదేనా!
on Oct 12, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -538 లో....అపర్ణ, ఇందిరాదేవి, ప్రకాష్, రాజ్ లు భోజనం చేస్తుంటారు. అప్పుడే ప్రకాష్ కావాలనే.. పాపం కావ్య అని అనగానే.. అసలు ఏమైందని రాజ్ అనుకుంటాడు. కావ్యకి ఇంత కష్టం వచ్చింది. అన్నం తినాలి అనిపించడం లేదని అపర్ణ ఇందిరాదేవిలు అంటారు. అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయాక.. రాజ్ ప్రకాష్ ని అసలు ఏమైందని అడుగుతాడు.. మర్చిపోయానురా అని ప్రకాష్ అంటాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని రాజ్ అనుకుంటాడు.
ఆ తర్వాత రాజ్, అపర్ణ, ఇందిరాదేవీల దగ్గరికి రాజ్ వెళ్తాడు అసలు ఏమైందని అడుగుతాడు. నువ్వే కదా పిల్ల గురించి చెప్పొద్దూ.. తల్లి గురించి చెప్పొద్దన్నావ్ కదా అని రాజ్ ని కాసేపు ఆటపట్టిస్తారు. మీరు చెప్పకుంటే ఏంటి కళ్యాణ్ ని అడుగుతానని రాజ్ అనగానే.. తెగే దాకా లాగడం ఎందుకని అపర్ణ ఇందిరాదేవిలు అనుకుంటారు. ఈ విషయం ఎవరికి తెలియదు. కావ్య వాళ్ళ అమ్మ కనకానికి క్యాన్సర్.. నెల రోజుల కంటే ఎక్కువ బ్రతకదని అనగానే.. రాజ్ షాక్ అవుతాడు. అందుకే చాలా నీరసంగా ఉంటుంది. మొన్న పూజకి వచ్చినప్పుడు కూడా రుద్రాణి, ధాన్యలక్ష్మిలు ఏం అన్నా కూడా సైలెంట్ గా ఉందని అపర్ణ అంటుంది.
మరొకవైపు కనకం క్యాన్సర్ పేషెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. రాజ్ వచ్చేసరికి లాయర్ తో ఈ ఇంటికి మూడు భాగాలు చేయండి. ముగ్గురు అల్లుల్ల పేరు మీద రాయండి అని కనకం లాయర్ తో అంటుంది. అదేంటి కూతుళ్ల పేరు మీద రాస్తాను అంటారు కదా అని లాయర్ అనగానే.. వాళ్ళకి పొగరు వస్తుంది. అందుకే ఇలా అని కనకం అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి లాయర్ ని పంపిస్తాడు. మీకు మంచి ట్రీట్ మెంట్ ఇప్పిస్తానని రాజ్ అనగానే.. ఇక స్టేజ్ దాటిపోయిందంటూ దగ్గుతు కర్చీఫ్ ఫై రెడ్ కలర్ వేస్తుంది. అది చూసి రాజ్ నమ్మేస్తాడు. ఆ తర్వాత మీకు చివరి కోరిక ఉందట ఏంటని రాజ్ అడుగగా.. రేపు మా పెళ్లి రోజు.. ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లతో పెళ్లి రోజు జరుపుకోవాలని ఉందని కనకం అనగానే రాజ్ ఆలోచిస్తాడు. కానీ కనకానికి సరే అని మాటిస్తాడు మా కుటుంబం మొత్తం వస్తారని రాజ్ చెప్తాడు.
ఆ తర్వాత రాజ్ వెళ్ళిపోతుంటే కావ్య వస్తుంది. ఎందుకు వచ్చాడని కనకాన్ని అడుగుతుంది. ఆ తర్వాత కనకం అపర్ణకి ఫోన్ చేసి.. ప్లాన్ సూపర్ హిట్.. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వస్తానన్నాడని చెప్పగానే.. అపర్ణ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగం లో దుగ్గిరాల కుటుంబం మొత్తం కనకం ఇంటికి వస్తారు. కావ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read