కమెడియన్ ఆలీ మోసం.. తెరవెనుక పాకిస్తాన్ కుట్ర.. నా అన్వేష్ సంచలన ఆరోపణలు!
on Mar 31, 2025
ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో.. ఐపీఎస్ సజ్జనార్, యూట్యూబర్ అన్వేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా.. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు బయటపెడుతూ వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా కమెడియన్ ఆలీని టార్గెట్ చేశాడు. "ఆలీ బెట్టింగ్ యాప్స్.. పాకిస్తాన్ తీవ్ర వాది" అనే థంబ్ నెయిల్ తో ఒక వీడియోని పోస్ట్ చేశాడు.
ఆలీ తనకు ఇష్టమైన కమెడియన్ అని, కానీ ఆయన ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడో అప్పటినుంచి ఆయన మీద అభిమానం పోయిందని అన్వేష్ అన్నాడు. "మీరు 50 ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నారు, వెయ్యి కోట్లకు పైగా సంపాదించి ఉంటారు.. అలాంటి మీరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి, పాపపు సొమ్ము సంపాదించుకోవడం అవసరమా?" అని ఆలీని అన్వేష్ ప్రశ్నించాడు.
ముస్లింలు అబద్దాలు చెప్పరు, ఇలాంటి పాపపు సొమ్ముకి ఆశపడరు. కానీ, ఆలీ గారు పవిత్రమైన రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని అన్వేష్ అన్నాడు. "బిర్యానీ మోసం" పేరుతో ఆలీ బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేశాడో అన్వేష్ రివీల్ చేశాడు. "ఆలీ, ఆయన వైఫ్ జుబేదాతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటారు. ఒక వీడియోలో పదివేల రూపాయల ఖర్చుతో బిర్యానీ వండి, దానిని పంచి పెట్టి, మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందారు. ఇలా చేయడం తప్పు కాదు.. కానీ, ఆ వీడియోలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశారు." అని అన్వేష్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఇలాంటి ప్రమోషన్స్ చేయడం తప్పని తాను కామెంట్ పెడితే.. అలా అని ఖురాన్ లో రాసుందా? అని షాకింగ్ రిప్లై ఇచ్చారని అన్వేష్ ఆరోపించాడు.
అలాగే ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి సంచలన విషయాన్ని కూడా అన్వేష్ బయటపెట్టాడు. ఆ యాప్ పాకిస్తాన్ కి చెందిన ఒక వ్యక్తిది అని.. పాకిస్తాన్, చైనా వంటి దేశాలు ఇండియా యూత్ ని దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని అన్నాడు. డబ్బుల కోసం ఆశపడి, ఆ యాప్స్ ని ప్రమోషన్ చేస్తూ.. మీకు తెలియకుండానే దేశానికి తీవ్ర నష్టం చేస్తున్నారని అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉప్పల్ బాలుని అందరూ ట్రోల్ చేస్తుంటారు. కానీ అతను పేదవాడు అయినప్పటికీ, బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయడం తప్పని వాటికి దూరంగా ఉన్నాడు. అలాంటిది ఇంత ఆస్తి ఉన్న ఆలీ.. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంపై అన్వేష్ అసహనం వ్యక్తం చేశాడు. బెట్టింగ్స్ యాప్స్ వల్ల ఎందరో యువత ప్రాణాలు కోల్పోయారు. ఆ యాప్స్ ని ప్రమోట్ చేసి మీరు సంపాదించిన పాపపు సొమ్ముని, కనీసం ఆ కుటుంబాలకి ఇచ్చి ఆదుకోండని అన్వేష్ అన్నాడు.
ఆలీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడాన్ని తప్పుబడుతూ అన్వేష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెజారిటీ నెటిజన్లు అన్వేష్ కి మద్దతు తెలుపుతూ.. ఆలీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
