తమన్నాతో అనుకున్న కథ వేరు.. 'రాజుగారి గది 3' కథ వేరు!
on Oct 18, 2019
'రాజుగారి గది 3' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'రాజుగారి గది 3' ఫ్రాంచైజీలో భాగంగా డైరెక్టర్ ఓంకార్ రూపొందించిన మూడో సినిమా ఇది. ఈ మూవీలో ఓంకార్ పెద్ద తమ్ముడు అశ్విన్ బాబు, 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం అవికా గోర్ ప్రధాన పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ సినిమాని మొదట తమన్నా ప్రధాన పాత్రధారిగా ముహూర్తపు షాట్ కూడా తీశారు. తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అవికా గోర్తో ఈ సినిమా చేశాడు ఓంకార్.
అయితే 'రాజుగారి గది'లో తమన్నా చెయ్యాల్సిన పాత్రను అవికా గోర్ చెయ్యలేదని వివరణ ఇచ్చాడు ఓంకార్. తమన్నాతో అనుకున్న కథ వేరనీ, ఇప్పుడు తీసిన సినిమా కథ వేరనీ ఆయన తెలిపాడు. "తమన్నాపై కథ నడిచే విధంగా మొదట 'రాజుగారి గది 3' కథ రాసుకున్నా. అయితే డేట్స్ సమస్య వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చెయ్యాలి. తర్వాత నా షెడ్యూల్ ప్రకారం 'సిక్స్త్ సెన్స్' గేం షోను ప్రారంభించాలి. అయితే దానికి తగిన విధంగా తమన్నా డేట్స్ అడ్జస్ట్ కాలేదు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె లేకుండా ఈ సినిమా చెయ్యాల్సి వచ్చింది. తర్వాత కాజల్ అగర్వాల్తో చేద్దామనుకున్నా. ఆమెకూ కథ బాగా నచ్చింది. కానీ ఆమెతోనూ సేమ్ డేట్స్ ప్రాబ్లెం. దాంతో ఇలా కాదనుకొని కథను మార్చేశా. అశ్విన్ కేరెక్టర్ చుట్టూ నడిచే విధంగా కథ రాశను. దెయ్యం కేరెక్టర్కు అవికా గోర్ను సంప్రదించాను. తనకు నచ్చి వెంటనే ఊపేసుకుంది. మొదట్నుంచీ కథ అశ్విన్ చుట్టూ నడిచినా, క్లైమాక్స్లో అవికా కేరెక్టర్ హైలెట్ అవుతుంది. ఆమె సూపర్బ్గా చేసింది" అని వివరించాడు ఓంకార్.