దోలారిధని లో గ్రాండ్ గా జరిగిన వీబి ఎంటర్టైన్మెంట్ బుల్లితెర అవార్డ్స్
on Nov 30, 2015
ప్రముఖ మార్కెటింగ్ సంస్థ వీబి ఎంటర్టైన్మెంట్ మొదటి వార్షికోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన బుల్లితెర అవార్డ్స్ కార్యక్రమం హైదరాబాద్లో గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ నటులు రాళ్ళపల్లి గారిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. బుల్లితెర నందు వివిధ రంగాలలో నటించిన నటీ నటులకు, విశిష్ట అతిధిగా వచ్చిన ఐపీఎస్ శ్రీ మాగంటి కాంతారావు గారి చేతుల మీదగా అవార్డ్స్ ప్రధానం చేశారు. అలాగే శ్రీ యన్ వెంకటేశ్వరావు గారు, శ్రీ సారేపల్లి గారి చేతుల మీదగా కొన్ని అవార్డ్స్ ప్రధానం చేయించారు. అలాగే ఆర్ధికంగా వెనుకబడిన కళాకారులకు వీబి ఎంటర్టైన్మెంట్ మానేజింగ్ డైరెక్టర్ ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ అవార్డ్స్ కార్యక్రమలో బుల్లితెర తారలు, తదితరులు పాల్గొని సందడి చేశారు. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కూడా ఈ కార్యక్రమలో తనదైన శైలిలో సందడి చేశాడు. రెడీయో మిర్చి, తెలుగు వన్ ఈ కార్యక్రమానికి న్ లైన్ మీడియా పార్టనర్ గా వ్యవహరించాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
