మూగవాడిగా మెగా హీరో!!
on Apr 25, 2019
ఇటీవల కాలంలో హీరోలకు ఏదో ఒక లోపం పెట్టి సినిమాలు సక్సెస్ కొడుతున్నారు దర్శకులు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `రంగస్థలం`లో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వాడిగా నటించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. నటుడుగా తన సత్తాను చూపించాడు. ఈ కోవలో మరో మెగా హీరో మూగ వాడిగా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఒకసారి వివరాల్లోకి వెళితే... మెగా మేనల్లుగు సాయితేజ్ (సాయి ధరమ్ తేజ్) తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో హీరో మాటలు రాని జాలరిలా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి సినిమానే ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈచిత్రంలో కేరళ కుట్టి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.