మహేశ్, తారక్, ప్రభాస్లను దాటేసిన వైష్ణవ్ తేజ్!
on Feb 22, 2021
ఒక కొత్త హీరోకు సంబంధించి ఇదొ గొప్ప ఫీట్. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన మూవీ రెండో వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పరుగు ఆపడం లేదు. ఈ నెల 12న విడుదలైన ఈ సినిమా పదో రోజు రూ. 2.61 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలో పదో రోజు స్టార్ హీరోల బ్లాక్బస్టర్ మూవీస్ సాధించిన వసూళ్లను సైతం అది అధిగమించడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' (రూ. 2.6 కోట్లు), మహేశ్ 'భరత్ అనే నేను' (రూ. 2.55 కోట్లు), 'మిర్చి' (2.54 కోట్లు) కలెక్షన్ల కంటే 'ఉప్పెన' ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది.
పదో రోజుకు సంబంధించి టాప్ ప్లేస్ రామ్చరణ్ 'రంగస్థలం' పేరిట ఉంది. ఆ సినిమా పదో రోజు రూ. 3.88 కోట్ల షేర్ను సాధించింది. తర్వాత స్థానాల్లో 'అల వైకుంఠపురములో..' (3.71 కోట్లు), 'సరిలేరు నీకెవ్వరు' (3.18 కోట్లు), 'శ్రీమంతుడు' (2.81 కోట్లు), 'సరైనోడు' (2.74 కోట్లు), 'ఎఫ్2' (2.69 కోట్లు) ఉన్నాయి.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన వండర్ మూవీ 'ఉప్పెన' పది రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 40 కోట్ల షేర్ మార్కును క్రాస్ చేసి, కొత్త హీరోల సినిమాలకు సంబంధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నిజమైన మగతనం ఏమిటనేది ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమా అన్ని అనుమానాలను పటాపంచలు చేసి.. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తోంది.