కావాలనే ఇలా చేశారా ?
on Jun 16, 2016
"ఉడ్తా పంజాబ్" సినిమా సెన్సార్ విషయంలో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది. చివరికి హైకోర్టు పుణ్యమా అని సింగిల్ కట్ తో "ఎ" సర్టిఫికేట్ ను సాధించగలిగింది చిత్ర బృందం. షాహిద్ కపూర్, ఆలియాభాట్, కరీనా కపూర్ ఖాన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం రేపు విడుదలకానుండి. "సెన్సార్ ఇష్యూ" కారణంగా విపరీతమైన పబ్లిసిటీ దొరకబుచ్చుకొన్న "ఉడ్తా పంజాబ్" సినిమాకు విపరీతమైన కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
అయితే.. వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ "ఉడ్తా పంజాబ్" పూర్తి నిడివి సినిమా నిన్న రాత్రి "టోరెంట్ సైట్స్"లో దర్శనమిచ్చింది. అక్కడ అప్లోడ్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 9 వేల డౌన్ లోడ్లు అయిపోయాయి. డౌన్ లోడ్ అయ్యాక తీరాచూస్తే అది "సెన్సార్" కోసం సెన్సార్ బోర్డ్ కి పంపిన కాపీ. అంటే.. కోర్టూలో ఓడిపోయిన సెన్సార్ బోర్డ్ సభ్యులు కక్ష సాధింపు చర్యగా "ఉడ్తా పంజాబ్" సెన్సార్ కాపీని టోరెంట్ సైట్లలో అప్లోడ్ చేశారని కొంతమంచి పేర్కొంటుండగా..పబ్లిసిటీ కోసం సినిమా యూనిట్ కావాలనే ఇలా చేసిందని ఇంకొందరు వాదిస్తున్నారు. ఎంత పబ్లిసిటీ కోసమైనా మొత్తం సినిమాను విడుదలకు రెండ్రోజుల ముందో ఆన్ లైన్ లో పెట్టేస్తారా? చెప్పండి. మరి ఇప్పటికే ఆన్ లైన్ లో సినిమాను కొన్ని వేల మంది వీక్షించి ఉండడంతో.. రేపు థియేటర్లలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని చూడడానికి ఎంతమంది వస్తారో చూడాలి!