కన్నప్ప నుంచి.. భరణి వాకౌట్?
on Jan 29, 2016

మిథునం తరవాత తనికెళ్ల భరణి మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు. ఆయన ఈలోగా కన్నప్ప అనే కథ రెడీ చేసుకొన్నారు. ముందుగా సునీల్కి వినిపించారు. ఆయన ఒకే అన్నాడు. అయితే డేట్లు క్లాష్ రావడంతో... ఈ కథ విష్ణు వరకూ వెళ్లింది. రూ.50 కోట్ల వ్యయంతో.. హాలీవుడ్ సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని విష్ణు డిసైడ్ అయ్యాడు. ఈయేడాది ఏప్రిల్లో ఈ సినిమా ఉంటుందని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. అయితే.. ఈ సినిమా నుంచి తనికెళ్ల భరణి అర్థాంతరంగా వాకౌట్ చేశారని టాక్. దాంతో కన్నప్ప ప్రాజెక్ట్ ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. భరణి మరో హీరోని వెదికిపట్టుకొంటారా? లేదంటే... విష్ణునే మరో దర్శకుడితో ఈ సినిమా లాగిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



