ENGLISH | TELUGU  

సుజీత్ దర్శకత్వంలో నాని.. పవన్ కళ్యాణ్ 'ఓజీ' పరిస్థితి ఏంటి?

on Jan 29, 2024

ఇప్పటిదాకా తన దర్శకత్వంలో వచ్చింది రెండే సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ సుజీత్. 2014లో వచ్చిన 'రన్ రాజా రన్'తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సాహో' సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ చిత్రం తెలుగునాట పెద్దగా ఆదరణ పొందినప్పటికీ.. నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాని అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇక సుజీత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఓజీ' అనే గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించే అవకాశముంది. వీలైనంత త్వరగా ఈ సినిమాని పూర్తి చేసి ఈ ఏడాదే విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సుజీత్.. నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మిగతా యంగ్ స్టార్స్ తో పోలిస్తే నాని లైనప్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. విభిన్న కథలు, విభిన్న పాత్రలు ఎంచుకుంటూ.. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటాడు. గతేడాది 'దసరా' వంటి ఊర మాస్ సినిమాతోనూ, 'హాయ్ నాన్న' వంటి పూర్తి క్లాస్ సినిమాతోనూ మెప్పించాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో 'సరిపోదా శనివారం' అనే యాక్షన్ డ్రామా చేస్తున్న నాని.. ఆ తర్వాత 'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే పీరియాడిక్ లవ్ స్టోరీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం నాని కోసం ఓ విభిన్న కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇక ఇప్పుడు నాని దర్శకుల లిస్టులో సుజీత్ కూడా వచ్చి చేరాడట. సుజీత్ డైరెక్షన్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి నాని ఓకే చెప్పినట్లు వినికిడి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ప్రస్తుతం సుజీత్ డైరెక్ట్ చేస్తున్న 'ఓజీ'కి, నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం'కి డీవీవీ దానయ్యే నిర్మాత కావడం విశేషం. ఆ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే వారిద్దరి కలయికలో సినిమా చేయడానికి దానయ్య సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

అయితే నాని-సుజీత్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుందట. 'ఓజీ' సినిమా పూర్తయ్యాకే సుజీత్ ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాడట. ఈ లోపు నాని కూడా తను కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాడట. 'సరిపోదా శనివారం'తో పాటు మరో సినిమాని పూర్తి చేసి.. సుజీత్ ప్రాజెక్ట్ తో పాటు పారలల్ గా ఇంకో సినిమా షూట్ లో పాల్గొనే ఆలోచనలో నాని ఉన్నాడట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.