ENGLISH | TELUGU  

అకీరాతో ‘ఓజీ2’.. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్‌ చెప్పిన సుజిత్‌!

on Sep 26, 2025

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరానందన్‌ హీరోగా ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి అడిగిన ప్రతిసారీ తల్లి రేణుదేశాయ్‌ విషయాన్ని దాటవేస్తూనే ఉన్నారు. తాజాగా పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ మూవీ ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందనే హింట్‌ కూడా ఇచ్చారు. అయితే ఇది ఎలా ఉండబోతోంది అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. మరో పక్క ఓజీ2ని అకీరాతో చేసేందుకు సుజిత్‌ ప్లాన్‌ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. 

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఓజీ2ని అకీరాతో చేయబోతున్నారా? అని అడిగిన ప్రశ్నకు సుజిత్‌ సమాధానమిస్తూ.. ‘ఓజీ సినిమా సెట్స్‌కు అకీరా వచ్చాడు. అతనిలో నాకు మంచి స్పార్క్‌ కనిపించింది. ఓజీ2ని అకీరాతో చెయ్యాలా వద్దా అనేది మీరు పవన్‌కళ్యాణ్‌గారినే అడిగితే బాగుంటుంది. చెయ్యమంటే నేను ఒప్పుకుంటాను. అతనిలో ఒక వైబ్‌ ఉంది. ఇంతకుమించి నేను మాట్లాడడం కరెక్ట్‌ కాదు. ఇంకా ఏమైనా మాట్లాడితే అది చాలా దూరం వెళ్లిపోతుంది. కాబట్టి ఈ టాపిక్‌ను ఇక్కడితో ఆపేస్తున్నాను’ అంటూ క్లారిటీ ఇచ్చారు. సుజిత్‌ మాటలను బట్టి ఓజీ2 అకీరాతో చెయ్యాలనే ఆలోచన ఉందనే విషయం అర్థమవుతుంది. ఈ న్యూస్‌ వచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ రచ్చ మొదలెట్టారు. అకీరా సినిమాల్లోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇప్పుడు సుజిత్‌ మాటలు విన్న తర్వాత ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. అకీరా ఎంట్రీ గురించి అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.