సుధీర్ వర్మ హవాలా థ్రిల్లర్!
on Jul 2, 2020
'స్వామి రా రా', 'కేశవ', 'రణరంగం' సినిమాలు తీసిన దర్శకుడు సుధీర్ వర్మ, ఓ వెబ్ సిరీస్ చేయడానికి సుముఖంగా ఉన్నాడు. నవీన్ చంద్ర హీరోగా అతడు ఓ థ్రిల్లర్ సిరీస్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అమెరికాలో ఫిలింమేకింగ్ కోర్స్ చేసి వచ్చిన ఓ యువకుడు చెప్పిన కథ నచ్చడంతో ఇద్దరూ 'యస్' అన్నారట. హవాలా రాకెట్ నేపథ్యంలో కథ ఉంటుందనీ, లాక్డౌన్కి ముందే కథ ఫైనలైజ్ చేశారనీ, 'ఆహా' ఓటీటీ కోసం ఈ సిరీస్ చేస్తున్నారని సమాచారం.
నవీన్ చంద్ర నటించిన 'భానుమతి రామకృష్ణ' సినిమాను శుక్రవారం (జూన్ 3న) నుండి 'ఆహా'లో చూడొచ్చు. ప్రస్తుతం అతడు రానా 'విరాటపర్వం', కీర్తీ సురేష్ 'మిస్ ఇండియా', వరుణ్ తేజ్ 'బాక్సర్' సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కొరియన్ హిట్ 'మిడ్ నైట్ రన్నర్స్'ను రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో సుధీర్ వర్మ రీమేక్ చేస్తున్నాడు. ఆ సినిమాలో నవీన్ చంద్ర విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తరవాత వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తారట.