'శ్రీమంతుడు' ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేసిన శ్రుతి!
on Aug 12, 2020
హీరో మహేశ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వీకరించింది. హైదరాబాద్లోని తన నివాసంలో బుధవారం మూడు మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె పంచుకుంది. మొక్కలు నాటుతున్న రెండు పిక్చర్స్ను షేర్ చేసిన ఆమె, "గ్రీనర్ ఇండియా కోసం మరో అడుగు ముందుకేయడంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు నన్ను నామినేట్ చేసినందుకు మహేశ్, దేవి శ్రీప్రసాద్కు థాంక్స్." అని ట్వీట్ చేసింది. తన వంతుగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్, ఇటీవలే వివాహితుల జాబితాలో చేరిన రానా దగ్గుబాటి, తన జిగరీ దోస్త్ తమన్నాల పేర్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం నామినేట్ చేసింది.
దీనిపై మహేశ్ స్పందించాడు. "Appreciate it @shrutihaasan. Glad to see the initiative gaining momentum" అని ఆమెకు రిప్లై ఇచ్చాడు. ఆగస్ట్ 9 తన బర్త్డే సందర్భంగా మహేశ్ తన ఇంట్లో మొక్కలు నాటి తమిళ స్టార్ యాక్టర్ విజయ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, శ్రుతి హాసన్లను నామినేట్ చేశాడు. మహేశ్ ఛాలెంజ్ను స్వీకరించిన విజయ్ మంగళవారం తన ఇంట్లో మొక్కలు నాటగా, ఈ రోజు శ్రుతి ఆ పని చేసింది. మహేశ్ కంటే ముందుగానే దేవి శ్రీప్రసాద్ కూడా శ్రుతి పేరును నామినేట్ చేశాడు. కాగా మహేశ్, శ్రుతి జంటగా నటించిన శ్రీమంతుడు మూవీ బ్లాక్బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. దానికి దేవి మ్యూజిక్ డైరెక్టర్.
Also Read