శర్వానంద్, నిత్యామీనన్ జంటగా ' రాజాధిరాజా '
on Mar 4, 2016
రాజా సెంటిమెంట్ శర్వానంద్ కు బాగా పట్టేసినట్టుంది. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత ఇప్పుడు రాజాధిరాజాగా వస్తున్నాడు. వరస విజయాలతో కెరీర్ మంచి ఊపు మీదున్న శర్వా, ఈ సినిమాలో నిత్యామీనన్ తో రొమాన్స్ చేశాడు. మార్చి మూడోవారంలో ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రాజాధిరాజా రాబోతున్నాడు. ఇది గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, అనుకోని కారణాల వల్ల పక్కకు వెళ్లిపోయింది. మొదట ఈ సినిమాకు ' ఏమిటో ఈ మాయ ' అని అనుకున్నారు. కానీ శర్వా కు రాజా సెంటిమెంట్ కలిసొస్తుండటంతో రాజాధిరాజాగా మార్చారు. మార్చి రెండో వారంలో ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. జివి ప్రకాష్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ గా నిలవనుందని సమాచారం. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి హిట్ తర్వాత రెండోసారి శర్వ, నిత్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం విశేషం.