`పోకిరి`ని టార్గెట్ చేసుకున్న `సర్కారు వారి పాట`?
on Oct 25, 2021
`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి రాబోతున్న చిత్రం `సర్కారు వారి పాట`. `గీత గోవిందం` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేశ్ కి జంటగా కీర్తి సురేశ్ నటిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు చాన్నాళ్ళ క్రితమే మేకర్స్ ప్రకటించారు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `ఆర్ ఆర్ ఆర్`, `రాధే శ్యామ్` వంటి రెండు పాన్ - ఇండియా మూవీస్ కేవలం వారం వ్యవధిలో విడుదలవుతున్న కారణంగా.. `సర్కారు వారి పాట`, `భీమ్లా నాయక్` సంక్రాంతి బరి నుండి వాయిదా బాట పట్టే అవకాశముందట. ఇదివరకే ఈ చిత్రాల విడుదల తేదిలు మారే అవకాశముందని వార్తలు వచ్చినా.. ఆయా సినిమాల యూనిట్స్ ముందుగా ప్రకటించిన తేదీలనే తమ తమ ప్రచార చిత్రాల్లో కన్ఫామ్ చేస్తూ వస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జనవరి 12 నుండి మార్చి 31కి `భీమ్లా నాయక్`, జనవరి 13 నుండి ఏప్రిల్ 28కి `సర్కారు వారి పాట` వాయిదా పడే అవకాశముందని తెలిసింది. అదే గనుక నిజమైతే.. మహేశ్ కి `పోకిరి` వంటి ఇండస్ట్రీ హిట్ ని అందించిన ఏప్రిల్ 28ని `సర్కారు వారి పాట`కి టార్గెట్ చేసుకున్నట్టే. `పోకిరి`కి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. `సర్కారు వారి పాట`కి ఆయన శిష్యుడు పరశురామ్ కెప్టెన్. చూడాలి మరి.. ఈ వాయిదా వార్తల్లో వాస్తవమెంతో!
Also Read