రవితేజ ఇలా అన్నాడేంటి..?
on Feb 5, 2018
యాక్షన్.. లవ్.. కామెడీ సినిమాలు టాలీవుడ్ను ఏలుతున్న కాలంలో తన సినిమాల్లో ఈ మూడింటింని మిక్స్ చేసి బంపర్ హిట్లు కొట్టి.. అగ్రకథానాయకుల రేంజ్కు దూసుకెళ్లారు మాస్ మహరాజ్ రవితేజ. తనదైన కామెడీ టైమింగ్తో కడుపు చెక్కలయ్యేలా నవ్వించడం.. సెంటిమెంట్తో ఏడిపించడం.. విలన్ల బెండు తీయడంతో ప్రేక్షకులు రవితేజ సినిమాలకు బ్రహ్మారథం పట్టారు.
అయితే ఇప్పటి టాలీవుడ్.. ఒకనాటి టాలీవుడ్ కాదు.. ఆడియన్స్ సినిమాలు చూసే తీరు మారిపోయింది. నాలుగు ఫైట్లు.. ఆరు డ్యూయెట్లు.. కాస్త కామెడీతో సినిమాలు తీస్తే జనం చూడటం లేదు. ఎంత పెద్ద సూపర్స్టార్లు నటిస్తున్నప్పటికీ.. కథలో కంటెంట్ మిస్సయ్యితే మెహమాటం లేకుండా తిప్పికొడుతున్నారు. ఇలాంటి సమయంలో తాను ఎక్స్పరిమెంట్స్ చేయను గాక చేయనని తేల్చి చెప్పాడు రవితేజ.
కొత్తదనంతో చేస్తుంటే సినిమాలు పోతున్నాయి.. అవేవి కమర్షియల్గా సక్సెస్ కొట్టేలేదు.. భో శివ శంభో ఏమైంది..? నేనింతే సినిమా చేశాను. అదేమైందో చూశారుగా. నా ఆటోగ్రాఫ్, ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమాలు ఎంత మంచి సినిమాలో మీకు తెలుసు. కానీ పోయాయి. ఎప్పుడూ ఒకేలా కనిపిస్తున్నానంటే.. జనాలకు ఏది నచ్చుతుందో అదే చేయాలి.. నా నుంచి వాళ్లు వినోదాన్ని కోరుకుంటున్నారు.. ఇక్కడ రవితేజ చెప్పినదానిని బట్టి చూస్తే.. మరి రీసెంట్గా వచ్చిన టచ్ చేసి చూడు ఎందుకు నెగిటివ్ టాక్ వచ్చింది. జనం మాస్ మహరాజ్ నుంచి ఫన్ని కోరుకుంటున్నారు.. అది కొత్తదనంతో నిండి ఉండాలి.. రాజా ది గ్రేట్లో రవితేజ ఎక్స్పరిమెంట్తో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు కాబట్టే.. దానికి వసూళ్ల పంట పండిందన్న విషయాన్ని మాస్ మహరాజా గుర్తిస్తే మంచిది అంటున్నారు క్రిటిక్స్.