దీపావళి స్పెషల్: రజినీకాంత్ వర్సెస్ కమల్ హాసన్
on Apr 9, 2021
తమిళనాట ఈ దీపావళి ఎంతో రసవత్తరంగా మారనుందా? అవునన్నదే కోలీవుడ్ బజ్. ఎందుకంటే.. 2021 దీపావళికి సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త చిత్రాలు బాక్సాఫీస్ పోరుకి సిద్ధమవుతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `శౌర్యం` శివ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న చిత్రం `అణ్ణాత్తే`. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, కరోనా కారణంగా నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దీంతో.. 2021 దీపావళికి `అణ్ణాత్తే`ని జనం ముందుకు తీసుకురానున్నారు.
ఇక కమల్ విషయానికి వస్తే.. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో `విక్రమ్` పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ వేసవికి ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో.. దీపావళికి `విక్రమ్`ని రిలీజ్ చేయాలని యూనిట్ డిసైడ్ అయిందట.
దీంతో.. 2021 దీపావళికి రజినీ వర్సెస్ కమల్ తప్పడం లేదు. మరి.. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.