పూరీ, మహేశ్ "జణ గణ మన" అసలు పట్టాలెక్కుతుందా..? మహేశ్ మౌనం ఎందుకు..?
on May 1, 2016
పూరీ జగన్నాథ్, మహేశ్ హీరోగా 2006లో వచ్చిన "పోకిరి" సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబులో ఉన్న మరో యాంగిల్ ను బయటకి తీసి చూపించాడు పూరీ. దాని తరువాత వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన "బిజినెస్ మాన్" సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పూరీ, మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా "జణ గణ మన". అయితే అశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినంత వరకూ ఈ సినిమా గురించిన ఎలాంటి టాక్ వినిపించలేదు. అయితే పూరీ రీలిజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మాత్రం రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ ఊపుతోనే మహేష్ తో "జణ గణ మన" అనే సినిమా తీస్తున్నట్టు అనౌన్స్ చేసేసాడు పూరీ.
కానీ మహేశ్ బాబు మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కనీసం అది నిజమో.. కాదో కూడా చెప్పలేదు. ఎందుకంటే ప్రస్తుతం మహేశ్ బ్రహ్మోత్సవం సినిమాతో బిజీగా ఉన్నాడు.. ఆతరువాత వెంటనే మురగదాస్ సినిమాకి కమిట్ అయ్యాడు. తెలుగు - తమిళ్ ల లో ద్విభాషా చిత్రంగా గా ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నాడు. మరి ఈ సినిమా అయ్యి పూరీ సినిమా పట్టాలెక్కాలంటే కనీసం రెండు సంవత్సరాలైనా పడుతోంది. ఇక మహేశ్ కూడా ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ ఏం మాట్లాడలేదు. అంతేకాదు మహేష్ నుంచి ఏదైనా ప్రకటన వస్తే కానీ నమ్మలేం అని అనుకుంటున్నారు కూడా. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read