తెలుగు టీచరుగా మారిన ప్రభాస్
on May 22, 2018
బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న బ్లాక్బస్టర్ సాహో! కానీ ఇందులో తెలుగు కంటే బాలీవుడ్ నటులే ఎక్కువ. సెట్స్లో తెలుగు డైలాగులు పలికేందుకు వాళ్లు తెగ కష్టపడిపోతున్నారట. దాంతో ప్రభాస్ ఓ అడుగు ముందుకు వేసి హీరోయిన్ ఎవ్లిన్ శర్మ, విలన్ నీల్ నితిన్ ముఖేష్లకు తెలుగు మాట్లాడటంలో సాయపడుతున్నాడట. ప్రస్తుతం సాహో చిత్ర యూనిట్ అబుదాబిలో ఉంది. ఏకంగా 90 కోట్లు ఖర్చుపెట్టి అక్కడ ఛేజింగ్ సీన్లు షూట్ చేస్తున్నారు. ఓ పక్క ఫైటింగ్ సీన్లు, మరో పక్క తెలుగు పాఠాలతో ప్రభాస్ మంచి బిజీగానే ఉన్నాడన్నమాట.