రాజులైనా, బంటులైనా అంటున్న కాటమరాయుడు
on Mar 12, 2017
డాలీ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న కాటమరాయుడు సినిమా ఆడియో రిలీజ్ ఉండదని నిర్మాతలు ముందే ప్రకటించారు. మూవీలోని ఆరు పాటలను రోజుకోక పాట చొప్పున విడుదల చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇప్పటికే "మిరా మిరా మీసం", " లాగే లాగే" అంటూ సాగే రెండు పాటలను రిలీజ్ చేశారు..వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో తర్వాతి పాటలు ఎలా ఉంటాయా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో పాట ఈ రోజు విడుదలైంది. "రాజులైనా, బంటులైనా.. కూలి అయినా, యాపారులైనా.. అంటూ సాగే ఈ పాట మాస్ను ఆకట్టుకునేలా ఉంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ గీతం మంచి మాస్ బీట్తో సాగుతోంది. "రంగు...రంగుల మందేయరా...వేయి ఏనుగల బలమొస్తదిరా అంటూ గాయకుడు ధనుంజయ పాడిన ఈ పాట హుషారుగా సాగుతోంది".
ఈ చిత్రంలో పవన్ పక్కన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. తమిళం విజయవంతమైన వేదాళం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న కాటమరాయుడు సినిమాకు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 24న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.