ENGLISH | TELUGU  

మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్‌!

on Nov 18, 2025

పవన్‌కళ్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన వయొలెంట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చేస్తున్నారు పవన్‌. ఈ సినిమా తర్వాత పవర్‌స్టార్‌ చేయబోయే సినిమా ఏమిటి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో విపరీతంగా ఉంది. 

పవర్‌స్టార్‌ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ న్యూస్‌ పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతనొక్కడే, కిక్‌, రేసుగుర్రం, ఊసరవెల్లి వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో పవన్‌కళ్యాణ్‌ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్‌క్యూజివ్‌ అప్‌డేట్‌ ఏమిటో చూద్దాం. 

పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ దక్కించుకున్న నిర్మాత రామ్‌ తాళ్లూరి నిర్మించే ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మిలటరీ మేజర్‌గా పవన్‌కళ్యాణ్‌ ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్‌ని అద్భుతంగా డిజైన్‌ చేశారు సురేందర్‌రెడ్డి. ఇంటర్వెల్‌ ముందు పవన్‌ క్యారెక్టర్‌ ఎంట్రీ ఇచ్చి దాదాపు 50 నిమిషాల పాటు నడుస్తుంది. మార్చి నుంచి ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్‌ డేట్స్‌ కేటాయించారు. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు. ఆ హీరో ఎవరు అనేది నెక్స్‌ట్‌ అప్‌డేట్‌లో తెలుసుకుందాం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.