బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో వస్తున్న చరణ్ కి.. మళ్ళీ ఏడాది గ్యాప్?
on Dec 1, 2021
2019 సంక్రాంతికి విడుదలైన `వినయ విధేయ రామ`తో చివరి సారిగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సరిగ్గా మూడేళ్ళ తరువాత మళ్ళీ అదే పొంగల్ సీజన్ లో `ఆర్ ఆర్ ఆర్`తో పలకరించబోతున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన ఈ మల్టిస్టారర్ జనవరి 7న తెరపైకి రాబోతోంది. అంతేకాదు.. ఈ సినిమా విడుదలైన నెల లోపే తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న `ఆచార్య`తో ఎంటర్టైన్ చేయనున్నారు ఈ కొణిదెల స్టార్. ఫిబ్రవరి 4న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్స్ లోకి రానుంది. సో.. బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో చరణ్ వినోదాలు పంచనున్నారన్నమాట. మూడేళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న చరణ్.. ఇలా వెంట వెంటనే సినిమాలతో సందడి చేయడం అభిమానులకు ఆనందాన్నిచ్చే అంశమే.
అయితే `ఆర్ ఆర్ ఆర్`, `ఆచార్య` తరువాత రామ్ చరణ్ కి మళ్ళీ గ్యాప్ తప్పడం లేదు. ఎందుకంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ.. 2023 ఫిబ్రవరిని టార్గెట్ చేసుకుందని సమాచారం. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని `దిల్` రాజు నిర్మిస్తున్నారు. మొత్తమ్మీద.. బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో వస్తున్న చరణ్ కి మరోసారి గ్యాప్ తప్పడం లేదన్నమాట.