దండయాత్ర చేయడానికి ఎన్టీఆర్ ప్లాన్..?
on May 16, 2016
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్స్ లో చాలా ఛేంజ్ వచ్చింది. మన సినిమా సైలెంట్ గా చేసుకుందాం.పక్క రాష్ట్రాల సంగతి మనకెందుకులే అనే టైప్ థింకింగ్ నుంచి బయటికొచ్చేశారు. మార్కెట్ పెంచుకుంటే, బడ్జెట్ పరిథితో పాటు కొత్త కథలు చేసే స్కోప్ కూడా పెరుగుతుందనే విషయాన్ని గుర్తించారు. మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి వాళ్లందరూ ఈ దారిని ఫాలో అవుతున్న వారే. ఈ లిస్ట్ లో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. బాద్ షా సినిమా తర్వాతి నుంచి ఓవర్సీస్ వాల్యూను గుర్తించిన తారక్, ఆ తర్వాతి సినిమాలకు అక్కడ మంచి ఆదరణ పొందగలిగాడు. ముఖ్యంగా జపాన్ లో అయితే బాద్ షా సెన్సేషనల్ హిట్. నాన్నకు ప్రేమతో యుఎస్ మార్కెట్ లో కాసులు కురిపించింది.
అందుకే నెక్స్ట్ రాబోయే జనతా గ్యారేజ్ కోసం యుఎస్ లో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నాడు తారక్. సినిమా ఆడియో ఫంక్షన్ ను అక్కడ నిర్వహించాలని డిసైడ్ అయ్యాడట. మోహన్ లాల్, నిత్యామీనన్ లాంటి మళయాళ స్టార్స్ ఉండటంతో, మళయాళంలో కూడా భారీగా ఆడియో ఫంక్షన్ ను చేయాలనుకుంటున్నాడట. తెలుగు స్టార్స్ లో అల్లు అర్జున్ కు ఏకఛత్రాధిపత్యంగా ఉండే మళయాళ మార్కెట్ లో తను కూడా దండయాత్ర చేయాలనేది తారక్ ప్లాన్. తెలుగు, తమిళంలో బ్రహ్మోత్సవం రిలీజ్, తెలుగు, మళయాళంలో సరైనోడు రిలీజ్, బాహుబలి దేశవ్యాప్త రిలీజ్, ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగు, మళయాళ, ఓవర్సీస్ విడుదలలు చూస్తుంటే తెలుగు సినిమా పరిథులు ఎల్లలు దాటేసినట్టే అనిపిస్తోంది కదూ..